ODI World Cup 2023: ఆ చెడ్డ కలే నిజమవుతుందా అని రితికాను అడిగా.. ప్రపంచకప్ ఫైనల్పై రోహిత్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma on ICC World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్ను కైవసం చేసుకుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకునే అవకాశం భారత జట్టుకు తృటిలో చేజారింది. దాంతో టీమిండియా క్రికెటర్స్ అందరూ ఫైనల్ ఓటమిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికే పలుమార్లు ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై స్పదించిన హిట్మ్యాన్.. తాజాగా మరోసారి ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తనను అప్పుడప్పుడు కలవరానికి గురి చేస్తోందని రోహిత్ తెలిపాడు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోజు ఉదయం వచ్చిన కల గురించి తన భార్య రితికాకు చెప్పిన విషయాన్ని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. ‘ప్రపంచకప్ ఫైనల్ తర్వాత రోజు ఉదయం నిద్ర లేచా. ఆ రాత్రి టీమిండియా ఓడిపోయినట్లు కల వచ్చింది. ‘ఆ కలే నిజమవుతుందా?. రేపు కదా మనం ఫైనల్ మ్యాచ్ ఆడాల్సింది’ అని పక్కనే ఉన్న రితికాతో అన్నా. కాసేపటికి అసలు విషయం గ్రహించా. నిన్ననే కదా మ్యాచ్ అయిందని గుర్తొచ్చింది. 4-5 రోజుల పాటు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయా. నాలుగేళ్ల తర్వాతే మళ్లీ వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం వస్తుందనుకున్నా’ అని హిట్మ్యాన్ రోహిత్ శర్మ చెప్పాడు.
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.770 పెరిగింది!
‘వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ వరకు మేం వరుస విజయాలు సాధించాం. అప్పటివరకు సరైన దారిలోనే ఉన్నాం. కప్ అందుకొనేందుకు చేరువగా వచ్చామని అంతా భావించారు. కానీ ఫైనల్లో అనూహ్యంగా ఓడిపోయాం. అహ్మదాబాద్లో ఉండేందుకు నా మనసు అస్సలు అంగీకరించలేదు. త్వరగా ప్రెసెంటేషన్ కార్యక్రమం ముగించి వెళ్లిపోదామనుకున్నా. తీవ్ర నిరాశలో ప్రతి భారత క్రికెటర్ ఉన్నాడు. జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఆ సమయంలో అర్థం చేసుకోలేం. అంతటి కోపం, నిరాశ ఎదురయ్యాయి’ అని రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ ఘనంగా ప్రారంభించింది. ఐర్లాండ్ను చిత్తుగా ఓడించి మంచి ఊపులో ఉంది.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!