Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!
- భారత్కు వికెట్తో పనేలేదు
- పంత్ అత్యుత్సాహం
- రోహిత్ శర్మ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Frustrated on Rishabh Pant: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 దశలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బాగానే కష్టపడింది. చివరకు బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ ఓడిపోక తప్పలేదు. ఆసీస్ను చిత్తుగా ఓడించి.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనితో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురైయ్యాడు. పంత్పై రోహిత్ సీరియస్ అయ్యాడు.
ఆస్ట్రేలియా మ్యాచ్లో 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ విజయం ఖరారైంది. 20వ ఓవర్ను హార్దిక్ పాండ్యా వేశాడు. స్ట్రైకింగ్లో ఉన్న మిచెల్ స్టార్క్.. కమిన్స్కు స్ట్రైకింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బై రూపంలో సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న కీపర్ రిషబ్ పంత్.. వికెట్లకు వేగంగా త్రో విసిరాడు. బంతి కాస్త బౌలింగ్ ఎండ్లో ఉన్న హార్దిక్ చేతికి బలంగా తాకింది. దాంతో హార్దిక్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఏంటి ఇలా విసిరావ్ అన్నట్లు ఓ చూపు చూసాడు. ఆ సమయంలో భారత్కు వికెట్తో పనేలేదు కానీ పంత్ అత్యుత్సాహం చూపించాడు. ఇది చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ పంత్పై సీరియస్ అయ్యాడు. బంతిని అలా ఎందుకు విసిరావ్? అని సైగలు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: IND vs ENG Semi Final: భారత్, ఇంగ్లండ్ సెమీస్కు ‘నో రిజర్వ్ డే’.. కారణం ఏంటంటే?
ఐపీఎల్ 2024లో విఫలమైన హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం చెలరేగుతున్నాడు. బ్యాట్, బంతితోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతడు భారత్కు ప్రధాన బలంగా మారాడు. కీలక సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టును టీమిండియా ఢీకొన్సాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో హార్దిక్కు గాయమై జట్టుకు దూరమైతే.. అది టీమిండియాకు ప్రతికూలంగా మారుతుంది. అందుకే రిషబ్ పంత్పై రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు.
— Nihari Korma (@NihariVsKorma) June 25, 2024
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!