Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!
- భారత్కు వికెట్తో పనేలేదు
- పంత్ అత్యుత్సాహం
- రోహిత్ శర్మ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Frustrated on Rishabh Pant: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 దశలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బాగానే కష్టపడింది. చివరకు బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ ఓడిపోక తప్పలేదు. ఆసీస్ను చిత్తుగా ఓడించి.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనితో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురైయ్యాడు. పంత్పై రోహిత్ సీరియస్ అయ్యాడు.
ఆస్ట్రేలియా మ్యాచ్లో 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ విజయం ఖరారైంది. 20వ ఓవర్ను హార్దిక్ పాండ్యా వేశాడు. స్ట్రైకింగ్లో ఉన్న మిచెల్ స్టార్క్.. కమిన్స్కు స్ట్రైకింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బై రూపంలో సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న కీపర్ రిషబ్ పంత్.. వికెట్లకు వేగంగా త్రో విసిరాడు. బంతి కాస్త బౌలింగ్ ఎండ్లో ఉన్న హార్దిక్ చేతికి బలంగా తాకింది. దాంతో హార్దిక్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఏంటి ఇలా విసిరావ్ అన్నట్లు ఓ చూపు చూసాడు. ఆ సమయంలో భారత్కు వికెట్తో పనేలేదు కానీ పంత్ అత్యుత్సాహం చూపించాడు. ఇది చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ పంత్పై సీరియస్ అయ్యాడు. బంతిని అలా ఎందుకు విసిరావ్? అని సైగలు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
Also Read: IND vs ENG Semi Final: భారత్, ఇంగ్లండ్ సెమీస్కు ‘నో రిజర్వ్ డే’.. కారణం ఏంటంటే?
ఐపీఎల్ 2024లో విఫలమైన హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం చెలరేగుతున్నాడు. బ్యాట్, బంతితోనూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతడు భారత్కు ప్రధాన బలంగా మారాడు. కీలక సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టును టీమిండియా ఢీకొన్సాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో హార్దిక్కు గాయమై జట్టుకు దూరమైతే.. అది టీమిండియాకు ప్రతికూలంగా మారుతుంది. అందుకే రిషబ్ పంత్పై రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు.
— Nihari Korma (@NihariVsKorma) June 25, 2024
తాజావార్తలు
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..