IND vs PAK: భారత్తో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ను బహిష్కరించాలన్న తన వైఖరిపై పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీతో కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం నాడు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాతో సమావేశం అయ్యారు.
T20 World Cup: T20 ప్రపంచ కప్ వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్లో భద్రతా కారణాలు చూపుతూ, బంగ్లాదేశ్ ఆడటానికి నిరాకరించింది. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి బహిష్కరించింది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది.
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో ఆ జట్టును ఓడించింది. టీమిండియా టోర్నీలో ఎప్పుడూ ఆధిక్యంలో ఉండటంతో ఈ ఓటమిని భారత్ ఊహించలేదు. ఇదే టోర్నమెంట్లో గ్రూప్ దశ మ్యాచ్లో భారత్ పాకిస్థాన్ను ఓడించింది. ఫైనల్లో టీమ్ ఇండియా రిపీట్ చేయలేకపోయింది. ప్రైజింగ్ వేడుకలో, భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్…