India vs Pakistan: సూర్యకుమార్ కాదు.. అతడు ఉండటమే టీమిండియాకు ప్లస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Coach Ashok Aswalkar Hails Rishabh Pant: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్పైనే ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో దాయాదుల పోరు చూసేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఐర్లాండ్ను చిత్తు చేసిన భారత్ సమరోత్సాహంతో ఉంది. టీమిండియా నుంచి ఎవరు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ బలంగా. అయితే భారత జట్టుకు అదనపు బలం మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ అని సూర్యకుమార్ చిన్ననాటి కోచ్ అశోక్ అశ్వాల్కర్ అన్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చి అద్భుత ప్రదర్శన చేయడం సాధారణ విషయం కాదన్నాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో అశోక్ అశ్వాల్కర్ మాట్లాడుతూ… ‘టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ రిషబ్ పంత్. రోడ్డు ప్రమాద ఘటన నుంచి కోలుకుని ఇక్కడికి టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికవడం అద్భుతం. పంత్మైం డ్సెట్ చాలా దృఢమైంది. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి ఐపీఎల్ 2024లో రాణించాడు. ఇప్పుడుప్రపంచకప్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తున్నాడు. ఐర్లాండ్పై బాగా ఆడాడు. పంత్ క్రీజ్లో ఉంటే మ్యాచ్ మన చేతుల్లో ఉన్నట్లే. పాకిస్తాన్ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఆరంభం ఇస్తే తిరుగుండదు. ఒకవేళ రోహిత్-కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్ రాకపోతే ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని తెలిపాడు.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: IND vs PAK: భారత్కు 60, పాక్కు 40 శాతం విజయావకాశాలు: పాక్ మాజీ స్టార్
2022 డిసెంబరు 30న రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం జట్టును వీడి ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళుతున్న పంత్ కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారులో మంటలు చెలరేగగా అటుగా వెళుతున్న ఓ వ్యక్తి అతడిని బయటికి తీశాడు. దాంతో పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గాయాలు, సర్జరీలతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసి సత్తాచాటాడు. 13 ఇన్నింగ్స్లలో 446 రన్స్ చేశాడు. ఈ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!