India vs Pakistan: సూర్యకుమార్ కాదు.. అతడు ఉండటమే టీమిండియాకు ప్లస్!
Suryakumar Yadav Coach Ashok Aswalkar Hails Rishabh Pant: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్పైనే ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో దాయాదుల పోరు చూసేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఐర్లాండ్ను చిత్తు చేసిన భారత్ సమరోత్సాహంతో ఉంది. టీమిండియా నుంచి ఎవరు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ బలంగా. అయితే భారత జట్టుకు అదనపు బలం మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ అని సూర్యకుమార్ చిన్ననాటి కోచ్ అశోక్ అశ్వాల్కర్ అన్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చి అద్భుత ప్రదర్శన చేయడం సాధారణ విషయం కాదన్నాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో అశోక్ అశ్వాల్కర్ మాట్లాడుతూ… ‘టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ రిషబ్ పంత్. రోడ్డు ప్రమాద ఘటన నుంచి కోలుకుని ఇక్కడికి టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికవడం అద్భుతం. పంత్మైం డ్సెట్ చాలా దృఢమైంది. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి ఐపీఎల్ 2024లో రాణించాడు. ఇప్పుడుప్రపంచకప్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేస్తున్నాడు. ఐర్లాండ్పై బాగా ఆడాడు. పంత్ క్రీజ్లో ఉంటే మ్యాచ్ మన చేతుల్లో ఉన్నట్లే. పాకిస్తాన్ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఆరంభం ఇస్తే తిరుగుండదు. ఒకవేళ రోహిత్-కోహ్లీ నుంచి మంచి ఇన్నింగ్స్ రాకపోతే ఇతర బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని తెలిపాడు.
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
Also Read: IND vs PAK: భారత్కు 60, పాక్కు 40 శాతం విజయావకాశాలు: పాక్ మాజీ స్టార్
2022 డిసెంబరు 30న రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం జట్టును వీడి ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళుతున్న పంత్ కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారులో మంటలు చెలరేగగా అటుగా వెళుతున్న ఓ వ్యక్తి అతడిని బయటికి తీశాడు. దాంతో పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గాయాలు, సర్జరీలతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసి సత్తాచాటాడు. 13 ఇన్నింగ్స్లలో 446 రన్స్ చేశాడు. ఈ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యాడు.
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!