Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో బుధవారం చెస్టర్ లీ స్ట్రీట్లో జరగబోయే మొదటి టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్యవంశీ తుది జట్టులోకి వస్తాడా లేదా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వనప్పటికీ.. కొద్ది నెలల క్రితమే టీ20 ప్రపంచకప్ గెలిచిన సీనియర్ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని భారత జట్టులోకి ఎంపిక చేసినప్పటి నుండి, అతడిని బరిలోకి దించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో, క్రీడా వర్గాల్లో బాగా పెరుగుతోంది. అయితే, ఒకవేళ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలంటే ప్రస్తుతం ఓపెనర్లుగా ఉన్న సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోడీని విడదీయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ అయ్యర్ స్పందిస్తూ, జట్టులోని ఆటగాళ్లందరికీ సురక్షితమైన వాతావరణం, తగినన్ని అవకాశాలు కల్పించడం ముఖ్యమని, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లకు ఈ ఫార్మాట్లో ఎలా ఆడాలో బాగా తెలుసని, వారు జట్టుకు బలమైన స్తంభాలని కొనియాడారు.
Also Read
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
- Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
- Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
సూర్యవంశీ రేపటి మ్యాచ్లో ఆడతాడా అనే ప్రశ్నకు అయ్యర్ బదులిస్తూ.. “రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మా వ్యూహాలు చాలా రహస్యంగా ఉంచుతాము. తుది జట్టు కలయికను ముందే వెల్లడిస్తే ప్రత్యర్థి జట్టుకు వ్యూహాలు తెలిసిపోయే అవకాశం ఉంది. వైభవ్ చాలా చిన్న వయస్కుడు, అతనికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాణిస్తాడు” అని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, సూర్యవంశీ అరంగేట్రం కోసం బయట నుండి ఒత్తిడి వస్తోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు, తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పారు. దీని ప్రకారం రేపు కూడా సూర్యవంశీకి నిరీక్షణ తప్పేలా లేదు. అయితే అయ్యర్ మాట్లాడిన మాటలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైభవ్ కు ఛాన్స్ ఇవ్వకపోతే.. ఐర్లాండ్ పరిస్థితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఐర్లాండ్ చేతిలో భారత్ అనుకోకుండా ఎదుర్కొన్న సిరీస్ ఓటమిపై అయ్యర్ స్పందించారు. ఆ ఓటమి అవమానకరం కాదు కానీ, చాలా బాధాకరమని అన్నారు. ఐర్లాండ్ జట్టు అన్ని విభాగాల్లో భారత్ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని, పిచ్లను అంచనా వేయడంలో, సరైన వ్యూహాలు అమలు చేయడంలో తాము వెనుకబడ్డామని అంగీకరించారు. ప్రపంచ ఛాంపియన్గా ఉన్న భారత్ను ఐర్లాండ్ 2-0తో ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ నుండి తాము ఎన్నో విషయాలు నేర్చుకున్నామని, ఈ తప్పులను ఇంగ్లాండ్ సిరీస్లో సరిదిద్దుకుంటామని శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?