IND vs ENG: ఒకప్పటి టీమిండియా కాదు.. అరవీర భయంకరంగా ఉంది: ఇంగ్లండ్ కెప్టెన్
- సెమీస్-2 భారత్-ఇంగ్లండ్
- భారత జట్టు పూర్తిగా మారిపోయింది
- బదులివ్వడానికి మేం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jos Buttler Said Team India has completely changed Now: టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరుకుంది. ఇప్పుటికే సెమీస్-2 పూర్తవగా.. మరికొద్ది గంటల్లో సెమీస్-2 జరగనుంది. ఇంగ్లండ్తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్లో ఇంగ్లండ్తోనే ఆడిన భారత్.. 10 వికెట్ల తేడాతో చిత్తయింది. దీంతో టీమిండియాపై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే 2022 సెమీస్లో తాము ఓడించిన భారత జట్టు ఇది కాదని, ప్రస్తుత టీమిండియా అరవీర భయంకరంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. భారత జట్టు ఇప్పుడు దూకుడు మంత్రంతో ఆడుతోందని తెలిపాడు.
సెమీస్-2 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జోస్ బట్లర్ పలు విషయాలపై స్పందించాడు. ‘2022 సెమీస్లో ఆడిన భారత జట్టుకు, ఇప్పటి జట్టుకు చాలా తేడా ఉంది. ఇప్పుడు మేం భిన్నమైన టీమిండియాతో ఆడనున్నాం. రోహిత్ శర్మ జట్టును నడిపించిన తీరు అద్భుతం. బ్యాటర్ల ఆడే విధానాన్ని చూస్తుంటే.. స్వేచ్ఛగా ఆడుతూ దూకుడైన ప్రదర్శన చేస్తున్నారు. 2022 టోర్నీ తర్వాత భారత జట్టు పూర్తిగా మారిపోయిందనిపిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్లో అద్భుతంగా ఆడింది. దూకుడు మాత్రంగా భారత్ ఆడుతోంది. టీమిండియాకు బదులివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. భారత్ మాదిరే దూకుడుగా మేమూ ఆడతాం’ అని బట్లర్ చెప్పాడు.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
Also Read: IND vs ENG: ఇంగ్లండ్తో సెమీఫైనల్.. అతడితో జర జాగ్రత్త విరాట్!
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ అపజయం లేకుండా కొనసాగుతోంది. గ్రూప్, సూపర్-8 స్టేజ్లో వరుస విజయాలు సాధించింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లను ఇంటికి పంపిన రోహిత్ సేన.. 2022 సెమీస్ ప్రతీకారానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. భారత్, ఇంగ్లండ్ తలపడిన గత ఆరు మ్యాచ్ల్లో నాలుగింట భారత్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!