IND vs ENG: ఒకప్పటి టీమిండియా కాదు.. అరవీర భయంకరంగా ఉంది: ఇంగ్లండ్ కెప్టెన్
- సెమీస్-2 భారత్-ఇంగ్లండ్
- భారత జట్టు పూర్తిగా మారిపోయింది
- బదులివ్వడానికి మేం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jos Buttler Said Team India has completely changed Now: టీ20 ప్రపంచకప్ 2024 తుది దశకు చేరుకుంది. ఇప్పుటికే సెమీస్-2 పూర్తవగా.. మరికొద్ది గంటల్లో సెమీస్-2 జరగనుంది. ఇంగ్లండ్తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్లో ఇంగ్లండ్తోనే ఆడిన భారత్.. 10 వికెట్ల తేడాతో చిత్తయింది. దీంతో టీమిండియాపై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే 2022 సెమీస్లో తాము ఓడించిన భారత జట్టు ఇది కాదని, ప్రస్తుత టీమిండియా అరవీర భయంకరంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. భారత జట్టు ఇప్పుడు దూకుడు మంత్రంతో ఆడుతోందని తెలిపాడు.
సెమీస్-2 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జోస్ బట్లర్ పలు విషయాలపై స్పందించాడు. ‘2022 సెమీస్లో ఆడిన భారత జట్టుకు, ఇప్పటి జట్టుకు చాలా తేడా ఉంది. ఇప్పుడు మేం భిన్నమైన టీమిండియాతో ఆడనున్నాం. రోహిత్ శర్మ జట్టును నడిపించిన తీరు అద్భుతం. బ్యాటర్ల ఆడే విధానాన్ని చూస్తుంటే.. స్వేచ్ఛగా ఆడుతూ దూకుడైన ప్రదర్శన చేస్తున్నారు. 2022 టోర్నీ తర్వాత భారత జట్టు పూర్తిగా మారిపోయిందనిపిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్లో అద్భుతంగా ఆడింది. దూకుడు మాత్రంగా భారత్ ఆడుతోంది. టీమిండియాకు బదులివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. భారత్ మాదిరే దూకుడుగా మేమూ ఆడతాం’ అని బట్లర్ చెప్పాడు.
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
Also Read: IND vs ENG: ఇంగ్లండ్తో సెమీఫైనల్.. అతడితో జర జాగ్రత్త విరాట్!
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ అపజయం లేకుండా కొనసాగుతోంది. గ్రూప్, సూపర్-8 స్టేజ్లో వరుస విజయాలు సాధించింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లను ఇంటికి పంపిన రోహిత్ సేన.. 2022 సెమీస్ ప్రతీకారానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. భారత్, ఇంగ్లండ్ తలపడిన గత ఆరు మ్యాచ్ల్లో నాలుగింట భారత్ విజయం సాధించింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!