MS Dhoni: 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీ ఆడతారా?.. MS ధోనీ సంచలన వ్యాఖ్యలు
- 2027 వన్డే ప్రపంచకప్లో రోహిత్, కోహ్లీ ఆడతారా లేదా? అని ఉత్కంఠ..
- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధోనీ..
- వయస్సు కాదు.. ఫిట్నెస్, ఫామ్ ముఖ్యం.. అందరికీ ఒకే రూల్ ఉండాలి: ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ ఆసక్తి రేపే ప్రశ్నల్లో ఒకటి – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా మాజీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్లారిటీ ఇచ్చారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది.. మొదట ధోని సరదాగా విననట్టు నటించాడు.. కానీ, వెంటనే సీరియస్గా స్పందిస్తూ.. వయస్సు కంటే ఫిట్నెస్, ప్రదర్శనలే అసలైన ప్రమాణాలు అని తేల్చి చెప్పాడు.
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
వయస్సు కాదు.. ఫిట్నెస్, ఫామ్ ముఖ్యం:
2027 వరల్డ్ కప్ ఎందుకు ఆడకూడదు? వయస్సు ఎప్పుడూ ప్రమాణం కాదు.. ప్రదర్శన, ఫిట్నెస్ అసలు క్రైటీరియా అని మహేంద్ర సింగ్ ధోని అన్నారు. 22 ఏళ్లవాడైనా ఫిట్ లేకపోతే జట్టులో ఉండకూడదు.. అదే 35 ఏళ్లవాడు ఫిట్గా, బాగా ఆడితే అతన్ని ఆడించాల్సిన అవసరం ఉందన్నారు. తాను భారత జట్టులోకి వచ్చినప్పుడు తన వయస్సు గురించి ఎవరూ ప్రశ్నించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా అందరినీ సమానంగా చూడాలని సూచించారు. “రోహిత్, విరాట్ లేదా భవిష్యత్తులో వచ్చే ఆటగాళ్లు– ఎవరికైనా ఒకే నియమాలు వర్తించాలి.. ఆడాలా వద్దా అన్నది వాళ్లే నిర్ణయించుకోవాలి.. దేశం కోసం ఆడాలనే ఆకాంక్ష ఉంటే, ప్రదర్శన కొనసాగితే ఎందుకు ఆపాలి? అని అడిగారు.
Read Also: Hyderabad: రూ.3 వేల లోన్కే న్యూడ్ ఫోటోలతో బెదిరింపులు.. లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి
ప్రపంచకప్లో అనుభవం కీలకం:
ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో అనుభవం ఎంత ముఖ్యమో కూడా ఎంఎస్ ధోని వివరించాడు. 20 ఏళ్ల వయస్సులోనే అనుభవం వస్తుందనుకోవడం తప్పు.. అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడే నిజమైన అనుభవం వస్తుంది అన్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే వాళ్లు లేదా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు అనుభవం చాలా అవసరం అని తెలిపారు.
యువత + అనుభవం = విన్నర్ టీం:
జట్టు ఎంపికలో యువత ఉత్సాహం, సీనియర్ల అనుభవం రెండూ అవసరమని మిస్టర్ కూల్ ధోని అభిప్రాయపడ్డాడు. అయితే, 24 ఏళ్ల ఆటగాడికి ఎలాంటి ప్రమాణాలు ఉంటాయో, 35 ఏళ్ల ప్లేయర్ కీ కూడా అవే ఉండాలని సూచించారు. ప్రదర్శన ఉంటే ఆడతారు.. లేకపోతే ఎప్పుడైనా జట్టులో నుంచి తప్పిస్తారు అన్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి గురించి ప్రశ్నే ఉండకూడదని తేల్చేశాడు. మొత్తానికి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచకప్లో ఆడతారా? అన్న ప్రశ్నకు మహేంద్ర సింగ్ ధోని సమాధానం స్పష్టం చేయడంతో రాబోయే వరల్డ్ కప్ నాటికి వీరు ఇరువురు ఫామ్ లో ఉంటే తుది జట్టులో ఉండే అవకాశం మెరుగ్గా ఉంటుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..