Suryakumar Yadav : ఒత్తిడి ఉంటుంది కానీ.. ఫ్యాన్స్కు ఎంటర్టైన్మెంట్ పక్కా!
- వాంఖడే స్టేడియంలో అమెరికాతో భారత్ మ్యాచ్
- హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదు
- ప్రాక్టీస్ సెషన్కు ముందు మీడియాతో మాట్లాడిన సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని అమెరికాతో ప్రారంభించబోతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదని అంగీకరించాడు. అయితే ఆ ఒత్తిడిని ఆస్వాదిస్తూ.. అభిమానులకు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని హామీ ఇచ్చాడు. శుక్రవారం చివరి ప్రాక్టీస్ సెషన్కు ముందు సూర్య మీడియాతో మాట్లాడాడు.
‘హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు అదనపు ప్రెషర్ ఉంటుంది. ఇది కచ్చితంగా అగీకరించాల్సిన విషయం. నిజాయతీగా చెప్పాలంటే నర్వస్, ఒత్తిడి ఉంటుంది. కానీ దీని పాజిటివ్ వైపు చూస్తే.. ఎంతో ఉత్సాహం ఉంటుంది. స్టేడియంలో 30 నుంచి 35 వేల మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తారు. కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తారు. వాళ్లందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మా కుర్రాళ్లకు ఇదే చెప్పా’ అని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
Also Read
- RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
- Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
- RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
- Mohammad Rizwan - Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ - బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
ప్రపంచంలో నెంబర్వన్ టీ20 జట్టుగా ఉన్న భారత్ మెగా టోర్నీలో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అయినప్పటికీ ఏ జట్టునూ తేలికగా తీసుకోవడం లేదని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. ‘టోర్నీలో బలహీనమైన జట్టు అంటూ ఏదీ లేదు. 20 జట్లు మంచి క్రికెట్ ఆడగల సామర్థ్యం ఉన్నవే. పొట్టి ఫార్మాట్లో 1-2 బ్యాటర్లు మ్యాచ్ను మలుపు తిప్పేయగలరు. లేదా ఒక బౌలర్ 24 బంతుల్లో గేమ్ను మార్చేయవచ్చు. అందుకే ప్రతి జట్టుతో ఒకే విధంగా ఆడాలి’ అని చెప్పాడు. యూఎస్ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సంజయ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ… ‘భారత్తో, అదీ ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఆడటం అమెరికా క్రికెట్కు గర్వకారణం. ఇది మా దేశంలో కొత్త తరం క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. అమెరికాతో జరిగే తొలి మ్యాచ్ నుంచే వరల్డ్కప్లో తన ఆధిపత్యాన్ని చాటాలని టీమిండియా ఆశిస్తోంది.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!