టీ20 వరల్డ్కప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని అమెరికాతో ప్రారంభించబోతోంది. ముంబై వాంఖడే స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న ఈ మ్యాచ్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి తప్పదని అంగీకరించాడు. అయితే ఆ ఒత్తిడిని ఆస్వాదిస్తూ.. అభిమానులకు పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తామని హామీ ఇచ్చాడు. శుక్రవారం చివరి ప్రాక్టీస్ సెషన్కు ముందు సూర్య మీడియాతో మాట్లాడాడు. ‘హోం గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు…