IPL 2023: గుజరాత్ సారథి మార్పు.. కెప్టెన్ గా శుభ్ మన్ గిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో 8 రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 ఎడిషన్ లో భాగంగా హార్థిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్యే జరుగనుంది. అయితే ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే గుజరాత్ టైటాన్స్ టీమ్ సారథి విక్రమ్ సోలంకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో ఓపెనర్ గా ఉన్న టీమిండియా బ్యాటర్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ భవిష్యత్ లో గుజరాత్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఐపీఎల్ -16 ఆరంభానికి ముందే ఈ మార్పు ఉండే అవకాశం ఉందని విక్రమ్ సోలంకి వెల్లడించినట్లు టాక్.
Also Read : Farooq Abdullah: రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరివాడు..
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
శుభ్ మన్ గిల్ లో నాయకత్వ లక్షణఆలు పుష్కలంగా ఉన్నాయని విక్రమ్ సోలంకే వీడియో కాన్ఫరేన్స్ మీటింగ్ లో వెల్లడించినట్లు తెలుస్తోంది. వృతి పట్ల అతడికున్న నిబద్దత కూడి గిల్ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే విధంగా ఉన్నాయన్నారు. గిల్ సమీప భవిష్యత్ లో గుజరాత్ కు సారథిగా వ్యవహరిస్తాడా.. అంటే అవుననే చెప్పగలను అంటు విక్రమ్ సోలంకే తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంతవరకూ అధికారికంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.. గిల్ చాలా టాలెంటెడ్ క్రికెటర్.. జట్టుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో మేం అతడి అభిప్రాయాలను గౌరవిస్తాం అని విక్రమ్ సోలంకి తెలిపాడు.
Also Read : Illicit Relationship : నా భార్య డ్రైవర్తో పారిపోయింది.. స్టేషన్లో ఫిర్యాదు
గత సీజన్ లో గిల్.. గుజరాత్ తరపున 16 మ్యాచ్ లు ఆడి 132.32 సగటుతో 432 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో హార్థిక్ పాండ్య తర్వాత స్థానం గిల్ దే.. ఇక ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తర్వాత గిల్ పై భారీ అంచనాలున్నాయి. కాగా గుజరాత్ తరపున ఆడుతున్న మహ్మద్ షమీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి అడిగిన ప్రశ్నపై సోలంకి సమాధానంగా షమీ మా టీమ్ లో కీలక ప్లేయర్ అన్నారు. గతేడాది మా టీమ్ తరపున అద్భుతంగా రాణించాడు. ఫాస్ట్ బౌలర్లను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఈ విషయంలో మేం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.. అని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత నేరుగా ఐపీఎల్ ఆడుతున్న షమీ.. అది ముగిశాక ఇంగ్లండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఆడనున్నాడు. గుజరాత్ టీమ్ నుంచి శుభ్ మన్ గిల్ కూడా భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరి విషయంలో గుజరాత్.. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఎలా నిర్వహిస్తుందన్నది వేచి చూడాలి..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!