IPL 2023: గుజరాత్ సారథి మార్పు.. కెప్టెన్ గా శుభ్ మన్ గిల్
మరో 8 రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023 ఎడిషన్ లో భాగంగా హార్థిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్యే జరుగనుంది. అయితే ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కు ముందే గుజరాత్ టైటాన్స్ టీమ్ సారథి విక్రమ్ సోలంకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో ఓపెనర్ గా ఉన్న టీమిండియా బ్యాటర్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ భవిష్యత్ లో గుజరాత్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఐపీఎల్ -16 ఆరంభానికి ముందే ఈ మార్పు ఉండే అవకాశం ఉందని విక్రమ్ సోలంకి వెల్లడించినట్లు టాక్.
Also Read : Farooq Abdullah: రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరివాడు..
Also Read
- Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
- Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
- IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
శుభ్ మన్ గిల్ లో నాయకత్వ లక్షణఆలు పుష్కలంగా ఉన్నాయని విక్రమ్ సోలంకే వీడియో కాన్ఫరేన్స్ మీటింగ్ లో వెల్లడించినట్లు తెలుస్తోంది. వృతి పట్ల అతడికున్న నిబద్దత కూడి గిల్ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే విధంగా ఉన్నాయన్నారు. గిల్ సమీప భవిష్యత్ లో గుజరాత్ కు సారథిగా వ్యవహరిస్తాడా.. అంటే అవుననే చెప్పగలను అంటు విక్రమ్ సోలంకే తెలిపారు. అయితే ఈ విషయంలో ఇంతవరకూ అధికారికంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.. గిల్ చాలా టాలెంటెడ్ క్రికెటర్.. జట్టుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో మేం అతడి అభిప్రాయాలను గౌరవిస్తాం అని విక్రమ్ సోలంకి తెలిపాడు.
Also Read : Illicit Relationship : నా భార్య డ్రైవర్తో పారిపోయింది.. స్టేషన్లో ఫిర్యాదు
గత సీజన్ లో గిల్.. గుజరాత్ తరపున 16 మ్యాచ్ లు ఆడి 132.32 సగటుతో 432 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో హార్థిక్ పాండ్య తర్వాత స్థానం గిల్ దే.. ఇక ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తర్వాత గిల్ పై భారీ అంచనాలున్నాయి. కాగా గుజరాత్ తరపున ఆడుతున్న మహ్మద్ షమీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి అడిగిన ప్రశ్నపై సోలంకి సమాధానంగా షమీ మా టీమ్ లో కీలక ప్లేయర్ అన్నారు. గతేడాది మా టీమ్ తరపున అద్భుతంగా రాణించాడు. ఫాస్ట్ బౌలర్లను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఈ విషయంలో మేం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.. అని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత నేరుగా ఐపీఎల్ ఆడుతున్న షమీ.. అది ముగిశాక ఇంగ్లండ్ వేదికగా జరుగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఆడనున్నాడు. గుజరాత్ టీమ్ నుంచి శుభ్ మన్ గిల్ కూడా భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరి విషయంలో గుజరాత్.. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఎలా నిర్వహిస్తుందన్నది వేచి చూడాలి..
తాజావార్తలు
-
Bad Breath Remedies: నోటి దుర్వాసనతో విసిగిపోయారా.? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి.!
-
Ampere Magnus Neo: ఫ్యామిలీ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆంపియర్ మాగ్నస్ నియో రిలీజ్.. 10 సంవత్సరాల బ్యాటరీ లైఫ్
-
Russia: మరణానికి బ్రేక్..150 ఏళ్లు జీవించవచ్చు.. పుతిన్ కల దిశగా రష్యా..
-
IPL Slapgate: చెంపదెబ్బతో కోటి సంపాదన.. శ్రీశాంత్ హర్భజన్పై సంచలన ఆరోపణలు.. స్లాప్గేట్ మళ్లీ వార్తల్లో
-
AIDS: ప్రతీ నలుగురిలో ఒకరికి HIV.. ఇలా ఉన్నారేంట్రా ఇక్కడ..?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!