Shikhar Dhawan: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్గా రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shikhar Dhawan Creates New Record In IPL As Indian Player: ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతవరకూ ఏ ఒక్క భారత క్రికెటర్ ఇప్పటివరకూ సాధించని రికార్డ్ని తన సొంతం చేసుకున్నాడు. బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అర్థశతకంతో (86) శివాలెత్తిన శిఖర్కి ఇది ఐపీఎల్లో 48వ అర్థశతకం. దీంతో.. ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్గా అతడు రికార్డ్ నెలకొల్పాడు. అయితే.. డేవిడ్ వార్నర్ మాత్రం 54 అర్థశతకాలతో అగ్రస్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ 45 అర్థశతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్పై శిఖర్ ధవన్కు ఇదో ఏడో హాఫ్ సెంచరీ. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 8 అర్థశతకాలు చేసి, ఆ జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అనంతరం ప్రస్తుతం తాను ఏ జట్టు (పంజాబ్ కింగ్స్) తరఫున అయితే ఆడుతున్నాడో, గతంలో ఆ జట్టుపైనే ఏడు అర్థశతకాలు బాదాడు. ఇక ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
Actor Akanksha Dubey Case: భోజ్పురి నటి ఆత్మహత్య… సింగర్ పై లుక్ అవుట్ నోటీసు
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86) అర్థశతకాలతో చెలరేగడం వల్లే.. పంజాబ్ కింగ్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 7 వికెట్ల నష్టానికి 192 పరుగులకే చాపచుట్టేసింది. సంజూ శాంసన్ (42) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో హెట్మేయర్(38), ధ్రువ్ జురేల్ (32) మెరుపు ఇన్నింగ్స్లతో తమ జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ.. చివర్లో శామ్ కర్రన్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, 5 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. పంజాబ్ బౌలర్లలో నథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Vijay-Rashmika: రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్… ఒకే ఇంట్లో.. ఒకే రూమ్ లో..?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!