Shikhar Dhawan: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్గా రికార్డ్
Shikhar Dhawan Creates New Record In IPL As Indian Player: ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంతవరకూ ఏ ఒక్క భారత క్రికెటర్ ఇప్పటివరకూ సాధించని రికార్డ్ని తన సొంతం చేసుకున్నాడు. బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అర్థశతకంతో (86) శివాలెత్తిన శిఖర్కి ఇది ఐపీఎల్లో 48వ అర్థశతకం. దీంతో.. ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్గా అతడు రికార్డ్ నెలకొల్పాడు. అయితే.. డేవిడ్ వార్నర్ మాత్రం 54 అర్థశతకాలతో అగ్రస్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ 45 అర్థశతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్పై శిఖర్ ధవన్కు ఇదో ఏడో హాఫ్ సెంచరీ. అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 8 అర్థశతకాలు చేసి, ఆ జట్టుపై అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అనంతరం ప్రస్తుతం తాను ఏ జట్టు (పంజాబ్ కింగ్స్) తరఫున అయితే ఆడుతున్నాడో, గతంలో ఆ జట్టుపైనే ఏడు అర్థశతకాలు బాదాడు. ఇక ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
Actor Akanksha Dubey Case: భోజ్పురి నటి ఆత్మహత్య… సింగర్ పై లుక్ అవుట్ నోటీసు
Also Read
- Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
- Shreyas Iyer: "222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది".. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
- Yashasvi Jaiswal: "నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే.." వైభవ్పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ (60), శిఖర్ ధవన్ (86) అర్థశతకాలతో చెలరేగడం వల్లే.. పంజాబ్ కింగ్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 7 వికెట్ల నష్టానికి 192 పరుగులకే చాపచుట్టేసింది. సంజూ శాంసన్ (42) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో హెట్మేయర్(38), ధ్రువ్ జురేల్ (32) మెరుపు ఇన్నింగ్స్లతో తమ జట్టుని విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ.. చివర్లో శామ్ కర్రన్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, 5 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. పంజాబ్ బౌలర్లలో నథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Vijay-Rashmika: రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్… ఒకే ఇంట్లో.. ఒకే రూమ్ లో..?
తాజావార్తలు
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
-
Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
-
Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో