Team India: పంత్కు పంచ్.. శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్లేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: కొత్త ఏడాది ఆరంభంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను మంగళవారం రాత్రి సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. శ్రీలంకతో టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో సీనియర్లంతా టెస్టు, వన్డే ఫార్మాట్లపై ఫోకస్ పెడతారని గతంలోనే బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.
Read Also: Largest Number of Languages: ఈ చిన్నదేశంలో 840 భాషలు మాట్లాడేస్తున్నారు
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
అయితే కొంతకాలంగా టీ20లు, టెస్టులకు కాకుండా కేవలం వన్డేలకు మాత్రమే ఎంపికవుతూ సారథిగా ఆడుతున్న శిఖర్ ధావన్కు శ్రీలంకతో వన్డే సిరీస్లో చోటు దక్కలేదు. దీనికి కారణం ధావన్ ఫామ్ అనే చెప్పాలి. బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో ధావన్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారు. అసలే ఓపెనింగ్కు రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్, శుభ్మన్గిల్ వంటి ప్రతిభావంతులు పోటీలో ఉండగా ధావన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో కూడా అతడు లేనట్లేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అతడి కెరీర్కు చరమగీతం పడినట్లే భావించాలని పలువురు భావిస్తున్నారు.
అటు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్నాళ్లుగా ఆకట్టుకోని వికెట్ కీపర్ రిషబ్ పంత్పైనా సెలక్టర్లు వేటు వేశారు. టెస్టుల్లో బాగానే ఆడుతున్నా టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్లలో రిషబ్ పంత్ పెద్దగా ఆడిందేమీ లేదు. దీంతో అతడి స్థానంలో ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్, సంజు శాంసన్లకు అవకాశం కల్పించారు. అయితే వీళ్లిద్దరిలో ఒకరికే జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఎవరిని ఆడిస్తారనేది అనుమానంగా ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!