Shahid Afridi: అక్తర్, షమీ వ్యవహారంపై స్పందించిన షాహీద్ అఫ్రిది.. ద్వేషాన్ని పెంచొద్దని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi reacts on Akhtar and Shami tweet war: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్, భారత పేసర్ మహ్మద్ షమీ మధ్య ట్వీట్ వార్ తీవ్రం అయింది. ఇరు దేశాల ఫ్యాన్స్ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి వ్యవహారంపై మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిది స్పందించారు. ఆదివారం మెల్బోర్న్ లో జరిగిన ఫైనల్స్ లో పాకిస్తాన్, ఇంగ్లాండ్ తో ఓడిపోవడంతో అక్తర్, షమీల మధ్య ట్వీట్ వార్ ఎక్కువైంది. వీరిద్దరి ట్వీట్స్ వైరల్ అయ్యాయి.
పాకిస్తాన్ ఓటమి అనంతరం షోయబ్ అక్తర్.. తన హృదయం ముక్కలు అయినట్లు ఎమోజీని పోస్ట్ చేశాడు. దీనికి రిప్లై ఇస్తూ మహ్మద్ షమీ ‘‘ సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. దీనికి ప్రతిగా అక్తర్, ప్రముఖ ఇండియన్ కామెంటర్ హర్షా భోగ్లే ట్వీట్ తో షమీకి సమాధానం ఇచ్చాడు. అయితే దీనిపై షాహీద్ అఫ్రిది స్పందించాడు. మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు ఇలాంటి కామెంట్స్ చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
Read Also: Buffalo Died: నాగేదె చనిపోవడానికి కారణం హెలికాప్టర్.. పోలీసులకు ఫిర్యాదు
మేము క్రికెటర్లు అంబాసిడర్ల వంటివాళ్లమని.. రెండు దేశాలు( భారత్, పాకిస్తాన్) మధ్య ఉన్న చీలికను అంతం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలని.. ప్రజల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మనమే ఇలా చేస్తే, అక్షరాస్యత లేని మూర్ఖుల నుంచి మనం ఏం ఆశించగలమని ప్రశ్నించారు. ఇరు దేశాలు సంబంధాలను ఏర్పరుచుకోవాలి. క్రికెట్ ఇందుకు సహకరిస్తుందని అఫ్రిది అన్నారు. భారత్ తో ఆడాలని అనుకుంటున్నామని.. పాకిస్తాన్ లో భారత టీమును చూడాలని అనుకుంటున్నానని అఫ్రిది సామా టీవీలో చర్చలో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రిటైర్డ్ ప్లేయర్లు, ప్రస్తుతం జట్టుకు ఆడుతున్న క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. మీరు అలాంటి వాటికి దూరంగా ఉండాలని షమీకి సూచించాడు. ఆదివారం జరిగిన సెమీస్ లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెండోసారి టీ20 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది.
తాజావార్తలు
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?