Sanju Samson Award: సంజు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’పై రచ్చ.. మిచెల్ సాంట్నర్ కీలక వ్యాఖ్యలు!
- టీ20 ప్రపంచ కప్ 2026లో సత్తాచాటిన సంజు
- శాంసన్కు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు
- మిచెల్ సాంట్నర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసింది. కీలక మ్యాచ్లలో సత్తాచాటిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ టోర్నీలో అత్యధికంగా 383 పరుగులు చేసినప్పటికీ.. అవార్డు సంజుకు దక్కింది. ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ను ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ‘సాహిబ్జాదా ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. అయినా సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడం ఎలా చూస్తారు?’ అని అడిగాడు. ఈ ప్రశ్నకు స్పందించిన సాంట్నర్ ముందుగా ‘క్షమించండి.. ఎవరు?’ అని అడిగాడు. జర్నలిస్ట్ మళ్లీ ‘పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాదా ఫర్హాన్’ అని బదులిచ్చాడు.
Also Read
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
- SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
దీనికి మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ… ‘అవార్డులు కేవలం గణాంకాల ఆధారంగా ఇవ్వరు. ఓ ప్లేయర్ మ్యాచ్పై చూపిన ప్రభావాన్ని బట్టి ఇస్తారు. సంజు శాంసన్ మూడు కీలక మ్యాచ్లలో అసాధారణ ఇన్నింగ్స్లు ఆడాడు. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక దశల్లో సంజు ప్రదర్శన భారత్కు టైటిల్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా, శ్రీలంక వంటి చిన్న జట్లపై ఫర్హాన్ పరుగులు చేశాడు. మ్యాచ్పై ప్రభావం చూపే ఇన్నింగ్స్లు అతడు ఆడలేదు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకు సంజు అర్హుడు’ అని వివరణ ఇచ్చాడు. సాంట్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా కీలక మ్యాచ్లలో జట్టుకు విజయాలు అందించిన ఆటగాళ్లకే ఇలాంటి అవార్డులు రావాలని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!