Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Double Murder: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపాయి. తిరుచానూరు రోడ్డులోని టీటీడీకి చెందిన పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న వివాహ వేడుకలో ఇద్దరిని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ అనే మహిళ కుమార్తెను ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్ కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. అయితే, కొద్ది నెలల కిందట ఎలాంటి కారణం చెప్పకుండా సునీల్ తన భార్యను వదిలేశాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు సునీల్ వస్తున్నట్లు సంపూర్ణమ్మకు సమాచారం అందింది. వెంటనే ఆమె తన కుమార్తె పెళ్లికి పెద్దలుగా ఉండి దగ్గరుండి వివాహం జరిపించిన మునిరత్నం, మణికంఠలకు ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో వారు కల్యాణ మండపానికి చేరుకుని సునీల్ను అడ్డుకున్నారు. సంపూర్ణమ్మ కుమార్తెను కారణం లేకుండా ఎందుకు వదిలేశావంటూ పెళ్లి మండపంలోనే సునీల్ను గట్టిగా నిలదీశారు.
ఈ సమయంలో అక్కడ ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ జరుగుతుండగానే సునీల్ తమ్ముడు, అతని అక్క, మరో బంధువు కలిసి అక్కడికి చేరుకున్నారు. సునీల్తో కలిసి ఆ నలుగురు ఒక్కసారిగా మునిరత్నం, మణికంఠలపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం రక్తపు మడుగులో మునిగి ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న మణికంఠను స్థానికులు వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికంఠ కూడా కన్నుమూశాడు. ఒక్కసారిగా జరిగిన ఈ జంట హత్యలతో కల్యాణ మండపంలోని వారంతా భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
అయితే, తిరుపతిలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్, అతని తమ్ముడు, అక్కతో పాటు మరో వ్యక్తి ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కొన్ని సంవత్సరాల క్రితం తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను సునీల్ వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది నెలల క్రితం ఎలాంటి కారణం చెప్పకుండా భార్యను వదిలివేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి సునీల్ హాజరవుతున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ, తన కుమార్తె వివాహానికి పెద్దలుగా వ్యవహరించిన మునిరత్నం, మణికంఠలకు సమాచారం ఇచ్చారు.
పెళ్లి మండపంలో సునీల్ను కలిసిన మునిరత్నం, మణికంఠలు అతడిని భార్యను వదిలివేయడంపై ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న సునీల్ సోదరుడు, అక్క, మరో బంధువుతో కలిసి వారిపై కత్తులతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటనలో మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పరారీలో ఉన్న సునీల్ కోసం పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
-
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
-
Clicky Ponting: ‘ఫేక్ ఎడ్జ్’ చీటింగ్ చేసింది ఇతగాడే.. వివాదంలో కొత్త ట్విస్ట్.. భారతీయ స్పాన్సర్షిప్ గుడ్బై!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!