Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saba Karim Sensational Tweet On Virat Kohli Rohit Sharma: ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ పెర్ఫార్మెన్స్ కనబరుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్క అర్థశతకం మినహాయిస్తే.. తన మార్క్ ఇన్నింగ్స్ అతడు ఆడలేదు. గత ఐదు మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ పరుగులకే పరిమితమై.. తన పేరిట చెత్త రికార్డ్ కూడా లిఖించుకున్నాడు. మరోవైపు.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్ ప్రారంభంలో బాగానే రాణించినా, ఆ తర్వాతి నుంచి తడబడుతున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగుకే ఔట్ అవ్వగా, అంతకుముందు డీసీతో జరిగిన మ్యాచ్లో నిదానంగా ఆడాడు. 46 బంతులు ఆడి 55 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోనే.. రోహిత్, కోహ్లీల ఫామ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లు అయ్యుండి.. ఇలా ఆడుతున్నారేంటని ఏకిపారేస్తున్నారు.
Priyanka Chopra: నా 17 ఏళ్ళ వయస్సులో నా భర్త.. నన్ను చూస్తూ ఆ పని చేశాడట
Also Read
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..

ఇప్పుడు తాజాగా టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్, మాజీ సెలక్టర్ సబా కరీం విరాట్, రోహిత్లపై సంచలన ట్వీట్ చేశాడు. ఆ ఇద్దరి పని అయిపోయిందన్నట్టుగా ట్వీట్లో పేర్కొన్నాడు. ‘‘యశస్వీ జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూస్తుంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నుంచి టీ20 క్రికెట్ మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తోంది’’ అంటూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్కి అనిల్ కుంబ్లే, హర్షా కుంబ్లేలను ట్యాగ్ చేశాడు. కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. లీగ్ క్రికెట్కు, అంతర్జాతీయ క్రికెట్కు తేడా ఉందని.. టీమిండియాను ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్లలో గెలిపించిన ఘనత రోహిత్, కోహ్లీలదని పేర్కొన్నారు. యశస్వి, సూర్యను ప్రశంసించడంలో తప్పులేదు కానీ.. ఆ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు. రోహిత్ పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడన్న మాట వాస్తవమే కానీ.. ఆసియా టీ20 కప్-2022, టీ20 ప్రపంచకప్-2022లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఎలా మర్చిపోతారంటూ ప్రశ్నిస్తున్నారు.
Yashasvi Jaiswal: నా ఎదుగుదలకు వారే కారణం.. సీక్రెట్ చెప్పేసిన జైస్వాల్
ఇదిలావుండగా.. ఈ ఐపీఎల్ సీజన్లో జైస్వాల్, సూర్య దుమ్ముదులిపేస్తున్నారు. సీజన్ మొదటి నుంచి జైస్వాల్ రప్ఫాడిస్తుండగా.. సూర్య ఈమధ్యే తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఐపీఎల్-2023లో యశస్వి జైశ్వాల్ ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్లో 167.15 స్ట్రైక్రేటుతో 575 పరుగులు సాధించాడు. ఇక సూర్య 186.13 స్ట్రైక్రేటుతో 376 పరుగులు చేశాడు. ఆర్సీబీ బ్యాటర్ కోహ్లి 11 ఇన్నింగ్స్లో 133.75 స్ట్రైక్రేటుతో 420 పరుగులు సాధించగా.. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ 11 ఇన్నింగ్స్లో 191 పరుగులు సాధించాడు.
తాజావార్తలు
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!