RP Singh: రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే! అయితే.. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, బుమ్రాలను విశ్రాంతి పేరిట ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. కొంతకాలం నుంచి తీరిక లేకుండా ఆడుతున్న ఈ సీనియర్లకు విశ్రాంతి తప్పదని చెప్పి, సెలెక్టర్లు తుది జట్టులోకి వారిని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మకు విశ్రాంతీ తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు.
‘‘రోహిత్ శర్మ ఈ సిరీస్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవాలా? వద్దా? అనేది అతని వ్యక్తిగతం. నిజానికి.. విశ్రాంతి అనేది ఓ ఆటగాడు ఎంత అలసటను అనుభవిస్తున్నాడనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇక్కడ రోహిత్కు విరామం అవసరం లేదు. ఇది సుదీర్ఘమైన సిరీస్ కాబట్టి అతడు కచ్ఛితంగా ఆడాల్సిందే. పైగా రోహిత్ శర్మ కెప్టెన్ కూడా.. ఈ విషయాన్ని మర్చిపోకండి. అవును, గత టీ20 లీగ్లో అతడు 400కి పైగా పరుగులు చేయలేదు. నిలకడగా రాణించనూ లేదు. కానీ రెండు, మూడు సార్లు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కావున అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయగలడని భావిస్తున్నా. టీ20 ఫార్మాట్లో మ్యాచ్ విన్నర్లు కావాలి’’ అంటూ ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
- Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్న్యూస్తో పాటు బ్యాడ్న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
- IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
- VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
కాగా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. మొత్తం 14 మ్యాచుల్లో అతడు 268 పరుగులే చేశాడు. దీనికితోడు అతడు ఈ సీజన్లో ఒక్క అర్థసెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి విశ్రాంతి అవసరమని భావించి.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు. విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే అభిప్రాయంతో ఎంపిక చేయలేదు. మరోవైపు.. బారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జూన్ 9వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!