Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
- రోహిత్ శర్మ భవిష్యత్తుపై ప్రచారం
- హిట్మ్యాన్ కెరీర్లో లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్
- రోహిత్ వివాదంపై బీసీసీఐ అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Warns Selectors Amid Rohit Sharma Retirement Speculation: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారం భారత క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇంగ్లండ్తో ఆదివారం లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే హిట్మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందంటూ.. పలు కథనాలు రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. రోహిత్ ఇంకా భారత వన్డే జట్టు ప్రణాళికల్లోనే ఉన్నాడని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ భవిష్యత్తుకు సంబంధించిన సమాచారం మీడియాకు లీక్ కావడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులు ఇకపై మీడియాతో ఎలాంటి అనధికారిక సంభాషణలు చేయొద్దని బోర్డు స్పష్టమైన సూచనలు చేసిందట. జట్టు అంతర్గత విషయాలు బయటకు రావడం సరైంది కాదని, ఇలాంటి లీకులు అనవసర ఊహాగానాలకు కారణమవుతున్నాయని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
- Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
- India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
- IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
ప్రస్తుతం రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్లో ఆడాలన్న లక్ష్యంతో కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల అతడి ఫామ్ బీసీసీఐ సెలెక్టర్లను ఆకట్టుకోలేదని నివేదికలు పేర్కొంటున్నాయి. గత ఎనిమిది వన్డే ఇన్నింగ్స్ల్లో రోహిత్ 241 పరుగులు మాత్రమే చేయగా.. సగటు 30.12గా ఉంది. ఈ గణాంకాల నేపథ్యంలో కొందరు సెలెక్టర్లు భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం.
గత నెల అఫ్గానిస్థాన్ సిరీస్కు ముందే సెలక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు రోహిత్ శర్మతో మాట్లాడి.. భవిష్యత్తు ప్రణాళికల్లో అతడికి స్థానం ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. ఈ చర్చల గురించి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా సమాచారం ఇచ్చినట్లు రాసుకొచ్చింది. అయినప్పటికీ బీసీసీఐ ఉన్నతాధికారులతో జరిగిన చర్చల అనంతరం రోహిత్కు అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్లలో అవకాశం లభించింది. అయితే ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల్లో వరుసగా 11, 26 పరుగులే చేయడంతో రోహిత్ ఫామ్పై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి. దీంతో సెలెక్టర్లు మరోసారి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్కు సెకండ్ హోమ్గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
-
శ్రావణంలో నాన్వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!