Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్.. 2027 వన్డే వరల్డ్కప్లో రో-కో!
- మొదటి వన్డే మ్యాచ్లో చెలరేగిన రో-కో
- కోహ్లీ సెంచరీతో (137), రోహిత్ (57) అర్ధ శతకం
- 2027 వన్డే వరల్డ్కప్లో రో-కో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీతో (137) చెలరేగగా.. రోహిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రో-కోలు రెండో వికెట్కు 109 బంతుల్లోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 80 పరుగులు రాబట్టారు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రో-కోలు ఇద్దరు చెలరేగడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము లేకుండా గెలవలేం అని రోహిత్-కోహ్లీలు మరోసారి నిరూపించారని నెటిజెన్స్ అంటున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. కోహ్లీ, రోహిత్ ఆట అద్భుతం అని ప్రశంసించారు. రో-కోలు లేకుండా 2027 వన్డే వరల్డ్కప్ ప్రణాళికలు సఫలం కావన్నారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆట అద్భుతం. వన్డే ప్రపంచకప్ 2027లో వీరిద్దరూ ఆడాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరూ 20 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే ప్రత్యర్థుల విజయావకాశాలు తగ్గుతాయి. రాంచి వన్డేలో అదే జరిగింది. రో-కోలు బాగా బ్యాటింగ్ చేశారు. వీరి భాగస్వామ్యమే భారత జట్టును విజేతగా నిలిపింది’ అని చెప్పారు.
Also Read
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కేవలం పరుగులు సాధించడం మీదే దృష్టి పెట్టలేదు. ఫిట్నెస్పై కూడా ఫోకస్ చేశారు. ప్రస్తుతం ఇద్దరి ఫిట్నెస్ అద్భుతం. రో-కోలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. ఒకే ఫార్మాట్ ఆడుతూ రిథమ్ కొనసాగించడం చాలా కష్టం. కానీ ఇద్దరూ అద్భుత ఫామ్లో ఉన్నారు. వన్డే ప్రపంచకప్ 2027లో 1, 3 స్థానాలను రోహిత్, కోహ్లీలు ఇప్పటికే ఫిక్స్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. రో-కోలు లేకుండా మనం కప్ గెలవలేం అని నా అభిప్రాయం’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ వివరించారు. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఇద్దరు మెగా టోర్నీలో ఆడడం పక్కా. రో-కోల కళ కూడా వన్డే ప్రపంచకప్ గెలవడమే అని తెలిసిందే.
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!