Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Test Records: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే రోజు ఏకంగా మూడు కీలక ఘనతలను అందుకుని తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో సిక్సర్ల పరంగా ఆడమ్ గిల్క్రిస్ట్ను అధిగమించడంతో పాటు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టాడు. విదేశీ లేదా తటస్థ వేదికల్లో భారత వికెట్ కీపర్గా చేసిన పరుగుల్లోనూ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించాడు.
ఆడమ్ గిల్క్రిస్ట్ను అధిగమించి:
రెండో టెస్టు రెండో రోజు రిషభ్ పంత్ 89 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ సిక్సర్లతో టెస్టు క్రికెట్లో పంత్ మొత్తం సిక్సర్ల సంఖ్య 102కు చేరింది. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. గిల్క్రిస్ట్ 96 టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టగా.. పంత్ కేవలం 52 టెస్టుల్లోనే 102 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 107 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
Also Read
- CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టి:
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనూ రిషభ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టి.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. గిల్ 42 టెస్టుల్లో 2,917 పరుగులు చేయగా.. పంత్ 2,948 రన్స్ చేశాడు. డబ్ల్యూటీసీలో పంత్ 42 మ్యాచ్ల్లో 74 ఇన్నింగ్స్లు ఆడి 42.11 సగటుతో పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఆరు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్:
విదేశీ లేదా తటస్థ వేదికల్లో భారత వికెట్ కీపర్గా అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగానూ రిషభ్ పంత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఎంఎస్ ధోనీ 48 టెస్టుల్లో 2,496 పరుగులు చేయగా.. పంత్ 2,534 పరుగులకు చేరుకున్నాడు. ఈ గణాంకాలతో పంత్ తన గురువు ధోనీని అధిగమించాడు. పంత్ ఇప్పటికే ఈ ఫార్మాట్లో దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో 249 పరుగులు చేశాడు. 62.25 సగటుతో బ్యాటింగ్ చేసిన అతడి స్ట్రైక్ రేట్ 73.02గా ఉంది. ఈ ఏడాది అతడి ఖాతాలో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?