Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Test Records: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే రోజు ఏకంగా మూడు కీలక ఘనతలను అందుకుని తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో సిక్సర్ల పరంగా ఆడమ్ గిల్క్రిస్ట్ను అధిగమించడంతో పాటు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టాడు. విదేశీ లేదా తటస్థ వేదికల్లో భారత వికెట్ కీపర్గా చేసిన పరుగుల్లోనూ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించాడు.
ఆడమ్ గిల్క్రిస్ట్ను అధిగమించి:
రెండో టెస్టు రెండో రోజు రిషభ్ పంత్ 89 బంతుల్లో 63 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ సిక్సర్లతో టెస్టు క్రికెట్లో పంత్ మొత్తం సిక్సర్ల సంఖ్య 102కు చేరింది. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. గిల్క్రిస్ట్ 96 టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టగా.. పంత్ కేవలం 52 టెస్టుల్లోనే 102 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 107 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
Also Read
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టి:
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలోనూ రిషభ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ను వెనక్కి నెట్టి.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. గిల్ 42 టెస్టుల్లో 2,917 పరుగులు చేయగా.. పంత్ 2,948 రన్స్ చేశాడు. డబ్ల్యూటీసీలో పంత్ 42 మ్యాచ్ల్లో 74 ఇన్నింగ్స్లు ఆడి 42.11 సగటుతో పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఆరు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్:
విదేశీ లేదా తటస్థ వేదికల్లో భారత వికెట్ కీపర్గా అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగానూ రిషభ్ పంత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఎంఎస్ ధోనీ 48 టెస్టుల్లో 2,496 పరుగులు చేయగా.. పంత్ 2,534 పరుగులకు చేరుకున్నాడు. ఈ గణాంకాలతో పంత్ తన గురువు ధోనీని అధిగమించాడు. పంత్ ఇప్పటికే ఈ ఫార్మాట్లో దూకుడైన బ్యాటింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో 249 పరుగులు చేశాడు. 62.25 సగటుతో బ్యాటింగ్ చేసిన అతడి స్ట్రైక్ రేట్ 73.02గా ఉంది. ఈ ఏడాది అతడి ఖాతాలో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!