Rashid Latif: రెస్ట్ ఇన్ పీస్ పాకిస్తాన్ క్రికెట్.. మాజీ క్రికెటర్ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Latif Makes Sensational Comments On Pakistan Cricket Board For Changing Players: ఈమధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులో రకరకాల మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఇప్పటికే అఫ్గానిస్తాన్తో జరగనున్న టీ20 సిరీస్కు.. బాబర్ ఆజం స్థానంలో షాదాబ్ ఖాన్ను కెప్టెన్గా నియమించింది. అంతేకాదు.. బాబర్తో పాటు షాహిన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, మహ్మద్ రిజ్వాన్ వంటి హేమాహేమీ ఆటగాళ్లను విశ్రాంతి పేరుతో పక్కనపెట్టింది. పాక్ జట్టుని కొత్తగా, పటిష్టంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో.. పాక్ బోర్డు ఈ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే.. ఈ మార్పులకు కొందరు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాజీలు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్కి సైతం ఈ మార్పులు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ మోడ్లో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Hyderabad Crime: భార్యని నరికి, పసికందును సంపులో వేసి.. భర్త పరార్
Also Read
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
- ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
- Zimbabwe Captain: ‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగా..? అయితే ఏంటి..? ఇదిగో ఇలా పంపిస్తాం’
- Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
ఐసీసీ ర్యాంకింగ్స్లో, అవార్డులు గెలుచుకోవడంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కొంతకాలం నుంచి ముందుంటున్నారని.. ముఖ్యంగా బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిదిలు గతేడాది ఐసీసీ అవార్డులను సొంతం చేసుకున్నారని రషీద్ పేర్కొన్నాడు. అయితే.. వాళ్లు ఇలా అవార్డులు పొందడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి నచ్చలేదని.. అందుకే తమకు నచ్చనివారిపై వేటు వేసేలా నిర్ణయాలు బోర్డు మెంబర్లు తీసుకుంటున్నారని మండిపడ్డాడు. విశ్రాంతి పేరుతో ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడమేంటని ప్రశ్నించాడు. బోర్డులో 70, 80 ఏళ్ల వయసులో ఉన్న సభ్యులు.. రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అజమాయిషీ చెలాయిస్తూ, పాక్ క్రికెట్ని మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశాడు. అందుకే.. ఇప్పుడు పాక్ క్రికెట్ ‘రెస్ట్ ఇన్ పీస్’లో ఉందని చెప్పగలనన్నాడు. కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం మంచిదే కానీ.. మొత్తం జట్టునే ప్రక్షాళన చేయాలనుకోవడం మూర్ఖత్వం కిందకు వస్తుందని ఫైర్ అయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ నాశనానికి ఇదే తొలి అడుగులా కనిపిస్తోందంటూ కుండబద్దలు కొట్టాడు.
KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!