Hyderabad Crime: భార్యని నరికి, పసికందును సంపులో వేసి.. భర్త పరార్
A Man Killed His Wife And 3 Month Old Son In Hyderabad: రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా నరికి చంపేశాడు. అంతేకాదు.. మూడు నెలల పసికందును సంపులో పడేసి హతమార్చాడు. కుమార్తెను కూడా చంపేందుకు ప్రయత్నించాడు కానీ, ఆలోపే ఆ చిన్నారి పారిపోయి తన ప్రాణాల్ని దక్కించుకుంది. మరోవైపు.. ఈ ఘోరానికి పాల్పడిన ఆ భర్త కంటికి కనిపించకుండా పారిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Pune: భార్యా, కొడుకును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్
Also Read
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
నాలుగు సంవత్సరాల క్రితం.. బండరావిరాలకు చెందిన లావణ్య అనే మహిళకు అనాజ్పూర్కి చెందిన ధనరాజ్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె, మూడు నెలల కుమారుడు ఉన్నారు. మొదట్లో వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాత వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇలా గొడవ జరిగిన ప్రతీసారి లావణ్య తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లడం, ధన్రాజ్ ఆమెను బుజ్జగించి తిరిగి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఇటీవల వీరి మధ్య మళ్లీ గొడవ కావడంతో.. లావణ్య మరోసారి పుట్టింటికి వెళ్లింది.
Air Hostess Archana: వీడిన ఎయిర్హోస్టెస్ మృతి మిస్టరీ.. అతడే చంపేశాడు
బుధవారం మధ్యాహ్నం బాలింతగా ఉన్న లావణ్యను తన పుట్టింటి నుంచి ధన్రాజ్ తీసుకొచ్చాడు. ఇంటికొచ్చిన కాసేపటికే భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు గొడ్డలితో లావణ్యని నరికి చంపాడు. అనంతరం మూడు నెలల కుమారుడ్ని సంపులో వేసి చంపేశాడు. లావణ్య, ధన్రాజ్ గొడవ పడుతున్న సమయంలో.. వీరి కుమార్ ఆద్య ఇంటి నుంచి పారిపోయి, ప్రాణాలు దక్కించుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం.. పోలీసులు రంగంలోకి దిగారు. కుటుంబ కలహాలతోనే ధన్రాజ్ ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు. పరారీలో ఉన్న ధన్రాజ్ కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!