Rashid Latif: రెస్ట్ ఇన్ పీస్ పాకిస్తాన్ క్రికెట్.. మాజీ క్రికెటర్ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Latif Makes Sensational Comments On Pakistan Cricket Board For Changing Players: ఈమధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులో రకరకాల మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఇప్పటికే అఫ్గానిస్తాన్తో జరగనున్న టీ20 సిరీస్కు.. బాబర్ ఆజం స్థానంలో షాదాబ్ ఖాన్ను కెప్టెన్గా నియమించింది. అంతేకాదు.. బాబర్తో పాటు షాహిన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, మహ్మద్ రిజ్వాన్ వంటి హేమాహేమీ ఆటగాళ్లను విశ్రాంతి పేరుతో పక్కనపెట్టింది. పాక్ జట్టుని కొత్తగా, పటిష్టంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో.. పాక్ బోర్డు ఈ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే.. ఈ మార్పులకు కొందరు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాజీలు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్కి సైతం ఈ మార్పులు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ మోడ్లో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Hyderabad Crime: భార్యని నరికి, పసికందును సంపులో వేసి.. భర్త పరార్
Also Read
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
- PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ఐసీసీ ర్యాంకింగ్స్లో, అవార్డులు గెలుచుకోవడంలో పాకిస్తాన్ ఆటగాళ్లు కొంతకాలం నుంచి ముందుంటున్నారని.. ముఖ్యంగా బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిదిలు గతేడాది ఐసీసీ అవార్డులను సొంతం చేసుకున్నారని రషీద్ పేర్కొన్నాడు. అయితే.. వాళ్లు ఇలా అవార్డులు పొందడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి నచ్చలేదని.. అందుకే తమకు నచ్చనివారిపై వేటు వేసేలా నిర్ణయాలు బోర్డు మెంబర్లు తీసుకుంటున్నారని మండిపడ్డాడు. విశ్రాంతి పేరుతో ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడమేంటని ప్రశ్నించాడు. బోర్డులో 70, 80 ఏళ్ల వయసులో ఉన్న సభ్యులు.. రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అజమాయిషీ చెలాయిస్తూ, పాక్ క్రికెట్ని మార్చాలనుకుంటున్నారని ఆరోపణలు చేశాడు. అందుకే.. ఇప్పుడు పాక్ క్రికెట్ ‘రెస్ట్ ఇన్ పీస్’లో ఉందని చెప్పగలనన్నాడు. కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం మంచిదే కానీ.. మొత్తం జట్టునే ప్రక్షాళన చేయాలనుకోవడం మూర్ఖత్వం కిందకు వస్తుందని ఫైర్ అయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ నాశనానికి ఇదే తొలి అడుగులా కనిపిస్తోందంటూ కుండబద్దలు కొట్టాడు.
KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..