Rashid Khan: రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్.. టీ20లోనే అగ్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Khan Creates World Record: ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ తాజాగా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బౌలర్గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ నమోదు చేయడంతో.. అతడు ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్లో రషీద్కి ఇది తొలి హ్యాట్రిక్ కాగా.. ఓవరాల్ టీ20లో మాత్రం నాల్గవది. ఈ జాబితాలో రషీద్ తర్వాత అండ్రూ టై, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా, రస్సెల్, తహీర్ ఉన్నారు. వీరిందరూ ఇప్పటివరకు టీ20 క్రికెట్లో మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు.
Amit Shah: చైనాకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్క అంగుళం కూడా తీసుకోలేరు
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
- Rahul Dravid: "హీరోలు లేకుండా క్రీడ ఉండదు".. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
- Shubman Gill: "మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు".. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రషీద్ తీసిన హ్యాట్రిక్ గురించి మాట్లాడితే.. తొలుత ఇతడు ఆండ్రూ రసెల్ వికెట్ పడగొట్టాడు. మొదట ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు కానీ, రివ్యూ తీసుకున్నాక అల్ట్రా ఎడ్జ్లో బ్యాట్కు బంతి తాకినట్టు తేలింది. దీంతో.. దాన్ని ఔట్గా ఖరారు చేశారు. అనంతరం సునీల్ నరైన్ భారీ షాట్ కొట్టబోగా.. అది నేరుగా ఫీల్డర్ చేతిలో క్యాచ్గా చేరింది. ఇక శార్దూల్ ఠాకూర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రషీద్ వేసిన బంతి అంచనాలకు అందని విధంగా స్వింగ్ అవ్వడంతో.. అది బ్యాట్కు బదులు ప్యాడ్స్ను తాకింది. తద్వారా అతడు ఔట్ అయ్యాడు. రివ్యూ తీసుకున్నా.. అది ఔట్గా తేలడంతో, కేకేఆర్ ఒక రివ్యూ కోల్పోవాల్సి వచ్చింది. ఇలా రషీద్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి, ఈ ఐపీఎల్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.
Kolkata Knight Riders: కేకేఆర్ చారిత్రాత్మక రికార్డ్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (53), విజయ్ శంకర్ (63) అర్థశతకాలతో రప్ఫాడించడంతో, గుజరాత్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. 207 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి ఓవర్లో ఐదు బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా.. మ్యాచ్ గుజరాత్దేనని దాదాపు అంతా ఫిక్సయ్యారు. కానీ.. ఊహించని విధంగా రింకూ సింగ్ ఐదు సిక్సులు బాది, కేకేఆర్ జట్టుకి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..