Vaibhav Sooryavanshi Debut: ఆడించమని వైభవ్ సూర్యవంశీకి చెప్పండి!
- ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లలో వైభవ్కు చోటు
- వైభవ్ అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
- వైభవ్తో సరైన కమ్యూనికేషన్ అవసరం అంటున్న పార్థివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parthiv Patel about Vaibhav Sooryavanshi Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 15 ఏళ్ల ఈ బ్యాటర్కు ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లకు భారత జట్టులో చోటు దక్కినప్పటికీ.. ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం మాత్రం రాలేదు. ఈ అంశంపై మాజీ క్రికెటర్లు, అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై స్పందించాడు. అరంగేట్రంపై వైభవ్తో టీమ్ మేనేజ్మెంట్ స్పష్టంగా మాట్లాడాలని సూచించాడు. నిన్ను ఇప్పుడే ఆడించమని అతడికి చెప్పడం టీమ్ మేనేజ్మెంట్ బాధ్యత అని పేర్కొన్నాడు.
స్టార్ స్పోర్ట్స్లో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్ సిరీస్లో ఏదో ఒక దశలో వైభవ్కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే అంతకంటే ముఖ్యమైనది అతడితో సరైన కమ్యూనికేషన్ ఉండటమేనని పేర్కొన్నాడు. ‘కోచింగ్ స్టాఫ్లో ఉన్నప్పుడు యువ ఆటగాళ్లకు సరైన సంకేతాలు ఇవ్వడం చాలా ముఖ్యం. వైభవ్ను ఆడించకూడదని నిర్ణయించినా.. ఆ విషయాన్ని అతడికి నేరుగా చెప్పాలి. అతడు కేవలం 15 ఏళ్ల బాలుడు. అతడితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొంత ఓపికగా ఉండాలని అర్థమయ్యేలా చెప్పాలి’ అని పార్థివ్ పటేల్ సూచించాడు.
Also Read
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
- India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
- WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
ప్రస్తుతం భారత టీ20 జట్టులో ఓపెనర్గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు బలమైన పోటీ ఇస్తున్నారని పార్థివ్ గుర్తు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారని, అందువల్ల ప్రస్తుతం వైభవ్కు తుది జట్టులో చోటు దక్కడం అంత సులభం కాదని పేర్కొన్నాడు. ‘సంజు ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇషాన్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్, అభిషేక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వైభవ్కు వెంటనే అవకాశం దక్కకపోవచ్చు. కానీ ఆ విషయాన్ని అతడికి స్పష్టంగా తెలియజేయడం టీమ్ మేనేజ్మెంట్ బాధ్యత’ అని పార్థివ్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ అనూహ్యంగా 0-2తో ఓటమిపాలైంది. ఆ సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితమయ్యాడు. ఇక ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసింది. అందులోనూ బుడ్డోడికి అవకాశం దక్కలేదు. దీంతో రెండో టీ20లోనైనా ఈ యువ సంచలనానికి అరంగేట్రం అవకాశం దక్కుతుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో కొనసాగుతోంది. చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో.
తాజావార్తలు
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!