2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరలించే ఛాన్స్..?
- పాకిస్తాన్లో కొనసాగుతున్న హైటెన్షన్ వాతావరణం..
- 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ నుంచి తరలించే అవకాశం..
- టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పాక్ అంగీకరించే ఛాన్స్..
2025 Champions Trophy: పాకిస్తాన్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాక్ నుంచి తరలించే అవకాశం ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను నిర్ణయించేందుకు వర్చువల్ సమావేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు ఏర్పాటుకు ఒక రోజు ముందు ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తే.. భద్రతాపరమైన సమస్యలు వస్తాయని పలు దేశాల బోర్డులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈవెంట్ను పాకిస్తాన్ నుంచి తరలించే ఛాన్స్ ఉంది. ఇక, PCB దీనిని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి అంగీకరించే అవకాశం కూడా ఉంది.
Read Also: AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన!
Also Read
- Viral: బిగ్ షాకింగ్... స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
- Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
- RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
అయితే, పాకిస్తాన్ రాజధాని ప్రాంతంలో సామాజిక-రాజకీయ అశాంతి కారణంగా పాకిస్తాన్ A జట్టుతో శ్రీలంక A జట్టు మిగిలిన రెండు వన్డే మ్యాచ్లు ఆడకూడదని నిర్ణయించుకుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ను విజయవంతంగా నిర్వహించాలనే పాకిస్తాన్ కు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. 1996 తర్వాత తమ మొదటి ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యమివ్వాలని పాకిస్తాన్ భావిస్తోండగా.. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరంగా చెప్పుకోవాలి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. దీంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కనిపిస్తే కాల్చి వేయండని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Sangareddy: అరోరా లైఫ్ సైన్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..
ఇక, ఛాంపియన్ ట్రోఫీని ఆడేందుకు సరిహద్దు దాటి వెళ్లేందుకు భారతదేశం నిరాకరించింది. అంతలోనే, పాకిస్థాన్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో.. దేశంలో మెగా ఈవెంట్ను నిర్వహించడం మరింత అసాధ్యమైంది. ఇక, పాక్ నుంచి టోర్నీ నిర్వహణ హక్కులను ఐసీసీ లాక్కునే అవకాశం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. అయితే, 2013లో శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టుపై దాడి జరిగిన తర్వాత అంతర్జాతీయ జట్లు ఒక దశాబ్దానికి పైగా పాకిస్థాన్కు వెళ్లేందుకు నిరాకరించాయి. ఇటీవలే ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక తమ జట్లను పాక్ పర్యటనలకు పంపించాయి. కానీ, శ్రీలంక A టూర్ రద్దు చేయడం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్కు వెళ్లకుండా పలు దేశాల క్రికెట్ టీమ్స్ జాగ్రత్తపడుతున్నాయి.
తాజావార్తలు
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
-
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!