Shreyas Iyer: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్గా శ్రేయస్.. గిల్, రోహిత్ పరిస్థితి..?
- ఆసియా కప్ జట్టులో శ్రేయాస్ అయ్యర్కు చోటు దక్కలేదు..
- 2027 వరల్డ్ కప్కు ముందే భారత వన్డే జట్టు కెప్టెన్ గా శ్రేయస్..
- త్వరలోనే సెలక్షన్ కమిటీ భేటీ.. శ్రేయాస్ అయ్యర్కు కెప్టెన్సీ విషయంలో నిర్ణయం..
Shreyas Iyer: టీ20 ఫార్మాట్తో జరగబోతున్న ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించింది. అందులో శ్రేయస్ అయ్యర్కు అవకాశం లభించలేదు. సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా శుభ్మన్ గిల్ను ఎంపిక చేసింది. అయితే, ఇటీవల అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచినా శ్రేయస్కు మొండిచేయి ఎదురు కావడంతో.. బీసీసీఐ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకూ 3 ఫార్మాట్లకు ఒకే సారథిని ఎంపిక చేద్దామని అనుకున్న టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు సమాచారం.
Read Also: Bedroom : మీ బెడ్రూంలో దాగి ఉన్న ప్రమాదం.. వెంటనే పారేయాల్సిన 3 ముఖ్యమైన వస్తువులు !
Also Read
- World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
- Abhishek Sharma: అభిషేక్ శర్మ ఒక స్లాగర్, గొప్ప ఆటగాడు కాదు.. పాక్ మాజీ క్రికెటర్ ఓవరాక్షన్..
- T20 World Cup Clash: టీమిండియాకు పాక్ స్టార్ బ్యాటర్ హెచ్చరిక..
- Ajinkya Rahane: భారత్తో మ్యాచ్ బాయ్కాట్ చేసే దమ్ము పాకిస్తాన్కు లేదు..
అయితే, ప్రస్తుతం భారత టెస్టు జట్టుకు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. ఇక, టీ20లకు సూర్యకుమార్ యాదవ్.. వన్డేలకు రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు గిల్ను పొట్టి ఫార్మాట్కు వైస్ కెప్టెన్గా చేయడంతో రాబోయే రోజుల్లో అతడికే జట్టు పగ్గాలు అప్పగిస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకూ ఆడాలనే టార్గెట్ తో ఉండగా.. అతడ్ని కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్ను వరల్డ్ కప్ 2027 వరకూ నియమిస్తారనే ప్రచారం కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా గిల్ను ఏకైక సారథిగా చేసే అవకాశం లేదని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also: Writer’s Room : ఇండస్ట్రీలో రాణించాలనుకునే వారికి అద్భుత అవకాశం
ప్రస్తుతం రోహిత్ శర్మకు 38 ఏళ్లు.. ప్రపంచకప్ నాటికి అతడికి 40+ అవుతుంది. దీంతో గిల్కే జట్టు బాధ్యతలు అప్పగించాలని మొదటి టీమిండియా మేనేజ్మెంట్ అనుకుంది. కానీ, వర్క్లోడ్తో అతడి ప్రదర్శనపై తీవ్ర ప్రభావం పడుతుందేమో అనే ఆందోళన మొదలైంది. దీంతో వన్డేలకు రోహిత్ బదులు శ్రేయస్ను కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుందనే వాదనా ప్రస్తుతం తెర పైకి వచ్చినట్లు సమాచారం. ఆసియా కప్ తర్వాత సెలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై రోహిత్, విరాట్ భవితవ్యంపై నిర్ణయం తీసుకుని.. శ్రేయస్కు టీమిండియా వన్డే జట్టు పగ్గాలు అందజేస్తారని ప్రసారం జరుగుతుంది.
తాజావార్తలు
-
AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!