Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- 2026 మహిళల ప్రపంచకప్
- ఆసక్తికరంగా గ్రూప్-A సెమీఫైనల్ పోరు
- భారత్ సెమీఫైనల్ చేరాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s World Cup 2026 – India: 2026 మహిళల ప్రపంచకప్లో గ్రూప్ A నుండి సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రూప్ A లోని జట్లన్నీ నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు నాకౌట్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దాదాపు సెమీఫైనల్ స్థానం ఖాయం చేసుకుంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో మూడు విజయాలతో 6 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం భారత్కు నెట్ రన్రేట్ భారీగా ప్లస్లో ఉండటం పెద్ద ఊరటనిచ్చే అంశం. భారత జట్టు నెట్ రన్రేట్ +2.268 కాగా, దక్షిణాఫ్రికా +0.734తో ఉంది. దీంతో చివరి మ్యాచ్ల ఫలితాలు సెమీస్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.
Also Read
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
దక్షిణాఫ్రికా ఓడితే భారత్కు నేరుగా సెమీస్:
దక్షిణాఫ్రికా తన చివరి లీగ్ మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో అద్భుతం జరిగి బంగ్లాదేశ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడితే.. భారత్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో గెలిచినా, ఓడినా సెమీఫైనల్కు చేరుతుంది. దీనికి కారణం.. రెండు జట్లకు 6 పాయింట్లు సమానంగా ఉన్నా, భారత్ నెట్ రన్రేట్ చాలా మెరుగ్గా ఉండటం.

దక్షిణాఫ్రికా గెలిస్తే.?
ఒకవేళ దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్పై విజయం సాధిస్తే.. ఆ జట్టు 8 పాయింట్లతో ముందుకు వెళ్తుంది. ఈ పరిస్థితిలో భారత్ కూడా ఆస్ట్రేలియాపై తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. భారత్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా మూడు జట్లు 8 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు సెమీఫైనల్కు వెళ్లే రెండు జట్లను నెట్ రన్రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్రేట్ దక్షిణాఫ్రికా కంటే చాలా మెరుగ్గా ఉండటంతో టాప్-2లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఓడితే టోర్నీకి గుడ్బై:
భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి, అదే సమయంలో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్పై గెలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో సెమీఫైనల్కు అర్హత సాధిస్తే.. భారత్ 6 పాయింట్లతోనే నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
కీలకంగా ఆస్ట్రేలియా మ్యాచ్:
మొత్తానికి భారత మహిళల జట్టుకు ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. నెట్ రన్రేట్ పరంగా భారత్ బలంగా ఉన్నప్పటికీ.. సెమీఫైనల్ బెర్త్పై ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే ఉత్తమ మార్గం.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!