Ishan Kishan: నేను అస్సలు టెన్షన్ పడలేదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు!
- రెండో టీ20లో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్
- 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 81 పరుగులు
- 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. శనివారం హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్తో పాటు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. అద్భుత ప్రదర్శనకు ఇషాన్ కిషన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తన ఇన్నింగ్స్పై సంతోషం వ్యక్తం చేశాడు. ‘తొలి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడినా నెను ఒత్తిడికి గురికాలేడు. కోల్పోయిన వికెట్ల గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఉండదు. గతం గతమే. ప్రతి బంతిని కొత్తగా చూసి ఆడటమే ముఖ్యం. నాకు నా బలాలు తెలుసు. ఏ బౌలర్పై ఎలా ఆడాలో, ఎప్పుడు పరుగులు చేయాలో తెలుసు. పరిస్థితికి తగ్గట్టు తెలివిగా బ్యాటింగ్ చేయడంపైనే దృష్టి పెట్టాను. చాలా సింపుల్గా ఆలోచించాను. నా సహజమైన షాట్లను ఆడాలని నాకు నేనే చెప్పుకున్నా’ అని ఇషాన్ తెలిపాడు. తొలి రెండు వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం తిలక్ వర్మతో కలిసి 94 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించి భారత్ను 20 ఓవర్లలో 219/5 భారీ స్కోరుకు చేర్చాడు.
Also Read
- India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
- Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
- Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
- India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
బౌలర్ల ప్రదర్శనపై కూడా ఇషాన్ కిషన్ ప్రశంసలు కురిపించాడు. ‘యువ పేసర్లు మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వాళ్లలో కనిపించే ఎనర్జీ జట్టుకు చాలా ఉపయోగపడుతోంది. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు.. ఫీల్డింగ్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ స్థాయికి రావడానికి వాళ్లు ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరి వెనుక ఒక గొప్ప కథ ఉంది. వాళ్లు ఇలాగే కష్టపడితే భవిష్యత్తులో భారత క్రికెట్లో పెద్ద స్థాయికి చేరుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉంది’ అని ఇషాన్ చెప్పాడు.
భారత్ బౌలర్లు కూడా బ్యాటర్లకు తగ్గట్టే అద్భుత ప్రదర్శన చేశారు. అభిషేక్ శర్మ మూడు వికెట్లు తీసి జింబాబ్వే బ్యాటింగ్ను దెబ్బతీయగా.. యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో జింబాబ్వే 129 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 90 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి సిరీస్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడో టీ20లో కూడా విజయం సాధించి జింబాబ్వేను క్లీన్స్వీప్ చేయాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈరోజు మూడో టీ20 జరగనుంది.
తాజావార్తలు
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
-
Vande Mataram Controversy: ‘వందేమాతరం’పై రాజకీయ దుమారం.. కాంగ్రెస్ కార్యాలయంలో ఏం జరిగింది?
-
India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!