RCB vs PBKS: బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్.. పంజాబ్ పై బెంగళూరు గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ తన మొదటి గెలుపును నమోదు చేసింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ పై బెంగళూరు విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. చివరలో దినేష్ కార్తీక్ కేవలం 10 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. అతనితో పాటు మహిపాల్ లోమ్రార్ కూడా కేవలం 8 బంతుల్లో 17 పరుగులు చేయడంతో బెంగళూరు గెలుపు బాటలో పయనించింది. ముఖ్యంగా ఈ గెలుపుకు కారణం విరాట్ కోహ్లీ అని చెప్పవచ్చు. 49 బంతుల్లో 77 పరుగులు చేయడంతో గెలుపు బాటలకు పునాదులు వేశాడు. ఇక.. ఆర్సీబీ బ్యాటింగ్ లో డుప్లెసిస్ (3), కామెరాన్ గ్రీన్ (3) పరుగులు చేసి నిరాశపరిచారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రజత్ పాటిదర్ (18) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మ్యాక్స్ వెల్ (3) పరుగులకే ఔటయ్యాడు. అనుజ్ రావత్ (11) రన్స్ చేశాడు.
Read Also: Virat Kohli: కోహ్లీ రికార్డుల మోత.. ఖాతాలో మరో రెండు
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పంజాబ్ బౌలింగ్ లో కగిసో రబాడా, హర్ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్ 1, సామ్ కరన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ (45) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (8) అనుకున్నంతగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ (25), లివింగ్ స్టోన్ (17) పరుగులు చేశారు. సామ్ కరన్ (23), జితేష్ శర్మ (27) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. చివరలో శశాంక్ సింగ్ కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేసి పంజాబ్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇక.. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, మ్యాక్స్ వెల్ తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత యశ్ దయాల్, ఆల్జరీ జోసఫ్ చెరో వికెట్ సంపాదించారు. ఇక.. రేపటి (మంగళవారం) మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఉండనుంది.
Read Also: Somu Veerraju: మాజీ అధ్యక్షుడి పోటీపై క్లారిటీ.. మంగళవారం అధికారిక ప్రకటన!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!