ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు అపజయమే లేని జట్టుగా నిలిచింది. పీబీకేఎస్ 5 మ్యాచ్లు ఆడగా.. నాలుగు విజయాలు అందుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైయింది. ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై అద్భుత విజయం అందుకుని.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. వరుస విజయాల నేపథ్యంలో పీబీకేఎస్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబైపై ఘన విజయం సాధించిన అనంతరం ‘సర్పంచ్ సాబ్’ సూపర్ అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టులోని యువ ఆటగాళ్లను ప్రీతి జింటా ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా ప్రభ్సిమ్రన్ సింగ్ ఆటతీరుకు ఫిదా అయ్యారు. అతను చూపిస్తున్న మెచ్యూరిటీ జట్టుకు ఎంతో ఉపయోగపడుతోందని అభినందించారు. పేసర్ అర్ష్దీప్ సింగ్ బౌలింగ్పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘మీ ఆట చూస్తే ఎంతో ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ‘సడ్డా సర్పంచ్’ అంటూ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వాన్ని ప్రశంసించారు. శ్రేయాస్ నాయకత్వంలో జట్టు అద్భుతంగా రాణిస్తోందని, కోచ్ రికీ పాంటింగ్ మార్గదర్శకత్వం జట్టుకు కీలకమని ప్రీతి జింటా రాసుకొచ్చారు.
Also Read: Jasprit Bumrah Wicketless: బుమ్రా మెరుపుల్లేవ్.. వరుసగా ఐదో మ్యాచ్, నో వికెట్.. ఇక కష్టమేనా!
మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ పట్టిన అద్భుత క్యాచ్పై ప్రీతి జింటా ప్రత్యేకంగా స్పందించారు. ‘నేను చూసిన బెస్ట్ క్యాచ్లలో ఒకటి’ అంటూ ప్రశంసించారు. శ్రేయాస్.. నీకంటే లేరెవరూ తోపు అంటూ మెచ్చుకున్నారు. జట్టు ప్రదర్శన చూసి తాను చాలా ఆనందంగా ఉన్నానని, చిరునవ్వు ఆగడం లేదని తన పోస్ట్లో పేర్కొన్నారు. పీబీకేఎస్ సమిష్టి ప్రదర్శన, యువ ఆటగాళ్ల మెరుపులు, కెప్టెన్-కోచ్ సమన్వయం జట్టును ఈ సీజన్లో అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. అభిమానుల మద్దతుతో పంజాబ్ టైటిల్ రేసులో ముందుంది. మిగిలిన 9 మ్యాచులలో 3 విజయాలు అందుకుంటే.. పీబీకేఎస్ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.