Prabhsimran Singh: బ్యాటింగ్లో ఎవరినీ కాపీ కొట్టను.. కీపింగ్లో మాత్రం ఆ దిగ్గజంలా ఉండేందుకు ప్రయత్నిస్తా!
- ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్కు అద్భుత ఆరంభం
- ఆడిన మూడు మ్యాచ్లలో రెండు విజయాలు
- పంజాబ్ విజయానికి ప్రధాన కారణం ఓపెనింగ్ జోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు అద్భుత ఆరంభం దక్కింది. ఇప్ప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో రెండు గెలవగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పంజాబ్ విజయానికి ప్రధాన కారణం ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ జోడీ. ఈ జోడీ మధ్య ఉన్న అద్భుత అండర్స్టాండింగ్, ఆటతీరు జట్టుకు బలంగా మారింది. ఐపీఎల్ 2025లోనే వీరిద్దరూ కలిసి 532 పరుగులు సాధించి ఓపెనింగ్లో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2026 సీజన్లో కూడా అదే జోష్ కొనసాగిస్తూ.. జట్టుకు అద్భుత విజయాలు అందించారు.
ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్యలు చెన్నై సూపర్ కింగ్స్పై కేవలం 4.1 ఓవర్లలో 61 పరుగుల మెరుపు భాగస్వామ్యం నమోదు చేశారు. తాజాగా ప్రభ్సిమ్రన్ మాట్లాడుతూ తమ జోడీ విజయానికి ప్రధాన కారణం ఏంటో చెప్పాడు. ఇద్దరి మాడ్యూల్ అవగాహన, టీమ్కు ప్రాధాన్యత ఇవ్వడమేనని వెల్లడించాడు. ‘ప్రతి మ్యాచ్లో ఒకరే ధాటిగా చేయాల్సిన అవసరం లేదు. నేను దూకుడుగా ఆడినపుడు ప్రియాంశ్ సింగిల్స్ తీసి నాకు స్ట్రైక్ ఇస్తాడు. అలాగే అతడు బౌండరీలు కొడుతున్నప్పుడు నేను సింగిల్స్ తీస్తాను. ఇది జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది’ అని చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2025లో ప్రభ్సిమ్రన్ సింగ్ 30 సిక్సర్లు బాది టాప్ సిక్స్ హిటర్లలో ఐదో స్థానంలో నిలిచాడు. తన సిక్స్ హిట్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భారత మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్తో చేసిన ప్రాక్టీస్ ఎంతో ఉపయోగపడిందని చెప్పాడు. ‘ప్రాక్టీస్లో పలు రకాల పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాలి. సిక్సర్లు కొట్టడం, ఎక్కువసేపు క్రీజులో నిలబడటం, కొత్త బంతి, పాత బంతి ఎదుర్కోవడం.. అన్ని టెక్నిక్ను మెరుగుపర్చాయి’ అని వివరించాడు. వికెట్ కీపర్గా తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు దిగ్గజం ఎంఎస్ ధోనీని ఆదర్శంగా తీసుకుంటున్నానని ప్రభ్సిమ్రన్ వెల్లడించాడు. ‘మహీ భాయ్ కీపింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన చేతులు చాలా ఫాస్ట్. నేను బ్యాటింగ్లో ఎవరినీ కాపీ చేయను కానీ.. కీపింగ్లో మాత్రం ధోనీలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని తెలిపాడు.
Also Read: IPL Trophy: తొలి టైటిల్ కోసం ఎదురుచూపులు.. ఆర్సీబీనే కాదు, చెన్నై-ముంబైకి తప్పని నిరీక్షణ!
ప్రభ్సిమ్రన్ సింగ్ తన కెరీర్ లక్ష్యాల గురించి మాట్లాడాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశాడు. ‘మా టీమ్ మీటింగ్స్లో కూడా అదే మాట్లాడుకుంటాం. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గురించి ఆలోచించం. జట్టుకు మ్యాచ్లు గెలిపించడం ముఖ్యం. నేను ముందు 30-40 పరుగుల దగ్గర ఔట్ అవుతుండేవాడిని. ఇప్పుడు ఎక్కువసేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య జోడీ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. పంజాబ్ ఈ సీజన్లో విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!