ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు అద్భుత ఆరంభం దక్కింది. ఇప్ప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో రెండు గెలవగా.. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పంజాబ్ విజయానికి ప్రధాన కారణం ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ జోడీ. ఈ జోడీ మధ్య ఉన్న అద్భుత అండర్స్టాండింగ్, ఆటతీరు జట్టుకు బలంగా మారింది. ఐపీఎల్ 2025లోనే వీరిద్దరూ కలిసి 532 పరుగులు సాధించి ఓపెనింగ్లో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2026 సీజన్లో కూడా అదే జోష్…