IND Vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్గా శిఖర్ ధావన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs SA: ఆసియా కప్లో ఘోర వైఫల్యంతో సూపర్4 దశలో ఇంటి ముఖం పట్టిన టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో వరుసగా మూడు టీ20ల సిరీస్ను ఆడనుంది. సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు వన్డేల సిరీస్లో కూడా తలపడనుంది. అయితే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్ నుంచి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు శిఖర్ ధావన్కు కెప్టెన్సీ అప్పగించాలని భావిస్తోంది. అంతేకాకుండా ఈ సిరీస్కు హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్కు పగ్గాలు అప్పగించనుంది.
Read Also: Gaddar : ఎర్ర మందారం కలర్ మారుతుందా..?
Also Read
- Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
- Doug Bracewell Banned: వివాదంలో మాజీ స్టార్ క్రికెటర్ డగ్ బ్రేస్వెల్.. రెండేళ్ల నిషేధం
- FIFA World Cup 2026: ఫుట్బాల్ ఫ్యాన్స్కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?
- IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్లు ఏవో తెలుసా..
కాగా టీ20 ప్రపంచకప్కు కీలక బౌలర్లు బుమ్రా, హర్షల్ పటేల్ అందుబాటులోకి రానున్నారని తెలుస్తోంది. మరి వీరిద్దరూ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లలో ఆడతారా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ప్రపంచకప్కు గాయం కారణంగా దూరంగా ఉంటాడని తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 20న మొహాలీలో ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి టీ20 ఆడనుంది. సెప్టెంబర్ 23న రెండో టీ20 నాగపూర్లో, సెప్టెంబర్ 25న మూడో టీ20 హైదరాబాద్లో జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించగా టీమిండియా ప్రకటించాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్లో ఆడే ఆటగాళ్లందరూ ఈ సిరీస్లో ఆడతారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం