Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ సీజన్ కోసం కీలక మార్పులు చేపట్టబోతోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత ఇస్తూ, రెడ్ బాల్ ఆటగాళ్లకు భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ప్రతిపాదిత కాంట్రాక్టుల ప్రకారం టెస్ట్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు, నెలవారీ రిటైనర్లు గణనీయంగా పెరగనున్నాయి. పీసీబీ వర్గాల సమాచారం ప్రకారం, వైట్బాల్ హెడ్ కోచ్ మైక్ హెసన్, రెడ్బాల్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్లతో కూడిన కమిటీ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ బ్లూప్రింట్ను సిద్ధం చేసింది. ఈ కొత్త విధానంలో ఆటగాళ్లను వారు ఆడే ఫార్మాట్ల ఆధారంగా వేర్వేరు ట్రాక్లుగా విభజించనున్నారు.
టెస్ట్ ఆటగాళ్లకు భారీ లాభాలు
కొత్త ప్రతిపాదన ప్రకారం ట్రాక్-ఏ కేటగిరీలో ఉండే టెస్ట్ క్రికెటర్లకు ఒక్కో టెస్ట్ మ్యాచ్కు సుమారు 15 లక్షల పాకిస్తానీ రూపాయల మ్యాచ్ ఫీజు లభించనుంది. గతంలో ఈ మొత్తం 8 లక్షల రూపాయలుగా ఉండేది. అంతేకాకుండా నెలకు సుమారు 40 లక్షల పాకిస్తానీ రూపాయల రిటైనర్ కూడా అందే అవకాశం ఉంది. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో కీలక పాత్ర పోషిస్తూ ట్రాక్-ఏ, ట్రాక్-బీ కేటగిరీల్లో చోటు దక్కించుకునే ఆటగాళ్లు మరింత లాభపడనున్నారు. అలాంటి క్రికెటర్లకు నెలకు 4.8 నుంచి 5 మిలియన్ పాకిస్తానీ రూపాయల వరకు రిటైనర్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
- Rohit Sharma: 2027 ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఉండాలా..? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
ఫార్మాట్ ఆధారిత కాంట్రాక్టులు
పీసీబీ తొలిసారిగా ఫార్మాట్ ఆధారిత సెంట్రల్ కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయబోతోంది. ఇందులో ట్రాక్-ఏ టెస్ట్ క్రికెటర్ల కోసం, ట్రాక్-బీ వన్డే మరియు టీ20 అంతర్జాతీయ ఆటగాళ్ల కోసం, ట్రాక్-సీ ప్రధానంగా టీ20 స్పెషలిస్టులు మరియు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడే ఆటగాళ్ల కోసం కేటాయించనున్నారు. ట్రాక్-బీ ఆటగాళ్లకు నెలకు సుమారు 18 లక్షల పాకిస్తానీ రూపాయల రిటైనర్ లభించనుండగా, ట్రాక్-సీ ఆటగాళ్లకు 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు రిటైనర్ అందే అవకాశం ఉంది.
బోనస్లలోనూ భారీ పెంపు
పీసీబీ ప్రదర్శన ఆధారిత బోనస్ విధానాన్ని కూడా మరింత ఆకర్షణీయంగా మార్చింది. ప్రతిపాదన ప్రకారం, పాకిస్థాన్ జట్టు ఐసీసీ టోర్నమెంట్ గెలిస్తే ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజుపై 500 శాతం అదనపు బోనస్ ఇవ్వనుంది. ఆసియా కప్ వంటి ఖండాంతర టోర్నమెంట్లలో విజయం సాధిస్తే 300 శాతం బోనస్ అందించనుంది.
కొత్త విధానంపై ఆసక్తి
ఈసారి సెంట్రల్ కాంట్రాక్టులు పొందే ఆటగాళ్ల పేర్లు, వారి కేటగిరీలను పీసీబీ బహిరంగంగా ప్రకటించకపోవచ్చని సమాచారం. ఒకవేళ అదే జరిగితే, పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. అయితే ఈ నిర్ణయం ఇప్పటికే కొంత విమర్శలకు కూడా దారితీస్తోంది. పీసీబీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత పెంచడంతో పాటు ఆటగాళ్లకు గతంతో పోలిస్తే మరింత ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఈ కొత్త విధానం ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్లోకి కిరణ్ అబ్బవరం సినిమా
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?