India vs England : దుమ్ములేపిన హర్దిక్ పాండ్యా.. భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాంప్టన్ వేదికగా నిన్న రాత్రి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకొంది. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా మెరిసాడు. ముందుగా బ్యాటింగ్కు దిగి టీమిండియా జట్టు 8 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లకు 148 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తన బౌలింగ్తో హార్దిక్ పాండ్యా చుక్కులు చూపించాడు. దీంతో వరుసగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు వికెట్లను కోల్పొయి పెవిలియన్ చేరారు. మొయిన్ అలీ చేసిన 36 పరుగులే ఆ జట్టులో అత్యధికం కాగా.. డేవిడ్ మలాన్ (21), హారీ బ్రూక్ (28), క్రిస్ జోర్డాన్ (26) పరుగులు చేసి వెనుదిరిగారు.
కెప్టెన్ జోస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, మాథ్యూ పార్కిన్సన్ డకౌట్ కాగా, జాసన్ రాయ్ 4, శామ్ కరన్ 4, టైమల్ మిల్స్ 7, రీస్ టోప్లే 9 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 51 పరుగులు చేయగా, దీపక్ హుడా 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశారు.
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
కెప్టెన్ రోహిత్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 17, దినేశ్ కార్తీక్ 11 పరుగులు చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో టీమిండియా ఇంగ్లాండ్పై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. రెండో టీ20 ఎడ్జ్బాస్టన్లో రేపు జరుగుతుంది.
తాజావార్తలు
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!