India vs England : దుమ్ములేపిన హర్దిక్ పాండ్యా.. భారత్ ఘన విజయం
సౌతాంప్టన్ వేదికగా నిన్న రాత్రి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్ టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకొంది. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా మెరిసాడు. ముందుగా బ్యాటింగ్కు దిగి టీమిండియా జట్టు 8 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లకు 148 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తన బౌలింగ్తో హార్దిక్ పాండ్యా చుక్కులు చూపించాడు. దీంతో వరుసగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు వికెట్లను కోల్పొయి పెవిలియన్ చేరారు. మొయిన్ అలీ చేసిన 36 పరుగులే ఆ జట్టులో అత్యధికం కాగా.. డేవిడ్ మలాన్ (21), హారీ బ్రూక్ (28), క్రిస్ జోర్డాన్ (26) పరుగులు చేసి వెనుదిరిగారు.
కెప్టెన్ జోస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్, మాథ్యూ పార్కిన్సన్ డకౌట్ కాగా, జాసన్ రాయ్ 4, శామ్ కరన్ 4, టైమల్ మిల్స్ 7, రీస్ టోప్లే 9 పరుగులు మాత్రమే చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 51 పరుగులు చేయగా, దీపక్ హుడా 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33, సూర్యకుమార్ యాదవ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశారు.
Also Read
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
- RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
కెప్టెన్ రోహిత్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 17, దినేశ్ కార్తీక్ 11 పరుగులు చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్కు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో టీమిండియా ఇంగ్లాండ్పై 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. రెండో టీ20 ఎడ్జ్బాస్టన్లో రేపు జరుగుతుంది.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!