India vs Pakistan : ఆసియా కప్లో రసవత్తర పోరు.. దుబాయ్లో భారత్-పాక్ ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. అసలు సిసలైన మ్యాచ్కి సమయం ఆసన్నమైనది.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్… యుఏఈ వేదికగా తలపడనున్నాయి… దాయాది జట్ల మధ్య రసవత్తర పోరు జరిగితే ఆ మ్యాచ్.. ఓ చిన్న యుద్ధంలాగే ఉంటుంది. ఎప్పుడూ క్రికెట్ చూడనివారు కూడా.. ఈ మ్యాచ్ చూసి తీరుతుంటారు.. అభిమానుల కోలాహోలం మధ్య ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగనప్పటికీ.. ఐసీసీ టోర్నీ, ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో ఇరుజట్లు తలపడుతున్నాయి. టీ20 ప్రపంచకప్లో ఓటమి బదులు తీర్చుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది. వెస్టిండీస్, జింబాబ్వేలో… సిరీస్లు గెలుపొంది మంచి ఊపుమీదుంది టీమిండియా. అదే జోరును ఆసియా కప్లోనూ కొనసాగించాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read Also: TS constable exam 2022: నేడు కానిస్టేబుల్ రాతపరీక్ష… ఇవి నిబంధనలు మరవొద్దు..
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
ఆసియా కప్లో భారత్ రికార్డు అద్భుతంగా ఉంటే… పాకిస్తాన్ జట్టు ట్రాక్ రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. రెండు సార్లు మాత్రమే ఆ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఆసియా కప్ను అత్యధిక సార్లు గెలుచుకున్న భారత్… మరోసారి ముద్దాడాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో టీమిండియా గెలవాలని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆకాంక్షించారు. టీమిండియా రన్ మిషిన్ విరాట్ కోహ్లీ… ఈ మ్యాచ్లో ఫామ్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జట్టు సమతూకంతో ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్లో పటిష్టంగా ఉంది. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, అశ్విన్, చాహల్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్లు ఉన్నారు.
ఇక, విరాట్ కోహ్లీ, యజువేంద్ర చాహల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లను మైదానంలో కలిసి కాసేపు మాట్లాడాడు అఫ్రిదీ. ముఖ్యంగా పంత్-అఫ్రిదీ కలిసి ఒకరిపై మరొకరు జోకులు వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.. పంత్తో కలిసి జోకులు పేల్చాడు అఫ్రిదీ. పంత్ మాదిరిగా ఒంటి చేత్తో సిక్సర్లు బాదాలని తాను అనుకున్నట్లు అతడితో అంటాడు అఫ్రిదీ. దీంతో ఇద్దరూ కాసేపు నవ్వుకుంటారు. ఈ వీడియోలు.. మ్యాచ్ ముందే వైరల్గా మారిపోయాయి..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!