Ind vs Eng 3rd T20: నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20.. సిరీస్పై కన్నేసిన టీమిండియా
- నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్..
- రాజ్ కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..
- ఇంగ్లాండ్తో జరిగే సిరీస్పై కన్నేసిన టీమిండియా
Ind vs Eng 3rd T20: టీమిండియా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్లో 2-0తో భారత జట్టు ముందంజలో ఉంది. ఈరోజు జనవరి 28) రాజ్కోట్ వేదికగా బట్లర్ సేనతో జరుగబోయే మూడో టీ20లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శనలు చేస్తూ సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తుంది. రాజ్కోట్లోనూ అదే ఊపును కొనసాగించాలనే వ్యూహంతో బరిలోకి సూర్య సేన దిగబోతుంది. మరోవైపు గత రెండు మ్యాచ్లలోనూ ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. మూడో టీ20లో అయినా విజయం సాధించి సిరీస్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
Read Also: Laila : అమ్మాయిగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో రిలీజ్
Also Read
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
- Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
అయితే, భారత జట్టు పగ్గాలను అందుకున్న సూర్య కుమార్ యాదవ్.. కెప్టెన్ అయ్యాక స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. సారథిగా జట్టుకు విజయాలను అందిస్తున్నప్పటికి.. వ్యక్తిగతంగా అతడి ఫామ్ మాత్రం బాగాలేదు. గత 17 ఇన్నింగ్స్లలో సూర్య.. 26.81 సగటుతో 429 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో పరుగుల వరద పారే రాజ్కోట్లో అయినా గత ఫామ్ను సూర్య అందుకోవాలని భారత్ యాజమాన్యం ఆశిస్తోంది. ఇక, సౌతాఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో రెచ్చిపోయిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్తో రెండు మ్యాచ్లలోనూ షార్ట్ బాల్స్కు పెవిలియన్ బాట పట్టాడు. రాజ్కోట్లో అతడు విజృంభిస్తే భారత్కు మంచి శుభారంభం దక్కుతుంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి టచ్లో ఉండగా.. రింకూ సింగ్, నితీశ్ కుమార్ గాయాలతో మ్యాచ్ లకు దూరం కాగా, ఈ మూడో టీ20లో శివమ్ దూబే, రమణ్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Road Accident: కొంప ముంచిన ఓవర్ స్పీడ్.. ముగ్గురు మైనర్ల దుర్మరణం
ఇక, టీమ్ నిండా స్టార్లు, హిట్టర్లు ఉన్నప్పటికీ ఈ సిరీస్లో ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ మినహా మిగిలిన వారందరూ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్స్టోన్ లాంటి హిట్టర్లంతా భారత పిచ్ లపై తేలిపోతున్నారు. రాజ్కోట్లో ఆ జట్టు తప్పనిసరి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్లోనూ ఓడితే ఇంగ్లీష్ జట్టు సిరీస్పై ఆశలు గల్లంతైనట్లే. ఆర్చర్, వుడ్, రషీద్ లాంటి బౌలర్లు భారత కుర్రాళ్లను అపలేకపోతున్నారు. అన్ని రంగాలలో బట్లర్ సేన ఇబ్బంది పడుతుంది. కాగా, రాజ్కోట్లో భారత్ ఆడిన ఐదు టీ20ల్లో నాలుగింటిలో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!