Ind vs Eng 3rd T20: నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20.. సిరీస్పై కన్నేసిన టీమిండియా
- నేడు భారత్- ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్..
- రాజ్ కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..
- ఇంగ్లాండ్తో జరిగే సిరీస్పై కన్నేసిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Eng 3rd T20: టీమిండియా కుర్రాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఐదు టీ20 సిరీస్లో 2-0తో భారత జట్టు ముందంజలో ఉంది. ఈరోజు జనవరి 28) రాజ్కోట్ వేదికగా బట్లర్ సేనతో జరుగబోయే మూడో టీ20లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శనలు చేస్తూ సిరీస్ కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తుంది. రాజ్కోట్లోనూ అదే ఊపును కొనసాగించాలనే వ్యూహంతో బరిలోకి సూర్య సేన దిగబోతుంది. మరోవైపు గత రెండు మ్యాచ్లలోనూ ఓడిన ఇంగ్లాండ్ జట్టు.. మూడో టీ20లో అయినా విజయం సాధించి సిరీస్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది.
Read Also: Laila : అమ్మాయిగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో రిలీజ్
Also Read
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
- FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
అయితే, భారత జట్టు పగ్గాలను అందుకున్న సూర్య కుమార్ యాదవ్.. కెప్టెన్ అయ్యాక స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. సారథిగా జట్టుకు విజయాలను అందిస్తున్నప్పటికి.. వ్యక్తిగతంగా అతడి ఫామ్ మాత్రం బాగాలేదు. గత 17 ఇన్నింగ్స్లలో సూర్య.. 26.81 సగటుతో 429 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో పరుగుల వరద పారే రాజ్కోట్లో అయినా గత ఫామ్ను సూర్య అందుకోవాలని భారత్ యాజమాన్యం ఆశిస్తోంది. ఇక, సౌతాఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో రెచ్చిపోయిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్తో రెండు మ్యాచ్లలోనూ షార్ట్ బాల్స్కు పెవిలియన్ బాట పట్టాడు. రాజ్కోట్లో అతడు విజృంభిస్తే భారత్కు మంచి శుభారంభం దక్కుతుంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి టచ్లో ఉండగా.. రింకూ సింగ్, నితీశ్ కుమార్ గాయాలతో మ్యాచ్ లకు దూరం కాగా, ఈ మూడో టీ20లో శివమ్ దూబే, రమణ్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Road Accident: కొంప ముంచిన ఓవర్ స్పీడ్.. ముగ్గురు మైనర్ల దుర్మరణం
ఇక, టీమ్ నిండా స్టార్లు, హిట్టర్లు ఉన్నప్పటికీ ఈ సిరీస్లో ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ మినహా మిగిలిన వారందరూ ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్స్టోన్ లాంటి హిట్టర్లంతా భారత పిచ్ లపై తేలిపోతున్నారు. రాజ్కోట్లో ఆ జట్టు తప్పనిసరి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్లోనూ ఓడితే ఇంగ్లీష్ జట్టు సిరీస్పై ఆశలు గల్లంతైనట్లే. ఆర్చర్, వుడ్, రషీద్ లాంటి బౌలర్లు భారత కుర్రాళ్లను అపలేకపోతున్నారు. అన్ని రంగాలలో బట్లర్ సేన ఇబ్బంది పడుతుంది. కాగా, రాజ్కోట్లో భారత్ ఆడిన ఐదు టీ20ల్లో నాలుగింటిలో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!