IND vs AUS: ఫైనల్ ఫైట్.. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Australia Lunch Break Innings: భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ కొనసాగుతుంది. ఆస్ట్రేలియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. తొలి సెషన్ లో నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా లంచ్ విరామానికి 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి.. 75 పరుగులు చేసింది.ట్రావిస్ హెడ్ 44 బంతుల్లో 32 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మార్నస్ లబుషేన్ విఫలమయ్యాడు. ప్రస్తుతం ఉస్మాన్ ఖవాజా 94 బంతుల్లో 27 పరుగులు, ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ 17 బంతుల్లో 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, షమీ తలో వికెట్ సాధించారు.
DK Aruna: అరెస్టయిన వారు పదే పదే కవిత పేరు ఎందుకు చెబుతున్నారో..
Also Read
- Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
- PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే పరుగులు సాధించడం మొదలు పెట్టారు. గత మూడు టెస్టులకు భిన్నంగా నాలుగో టెస్ట్ పిచ్ ఉంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఫోర్లతో విరుచుకుపడ్డారు. అదే టైంలో ఇండియన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ పలు క్యాచ్ లను నేలపాలు చేశాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన ఆశ్విన్ ట్రావిస్ హెడ్ ను అవుట్ చేయడంతో భారత్ కు ఫస్ట్ బ్రేక్ ను ఇచ్చాడు. కాసేపటికే లబుషేన్ ను ఇండియన్ బౌలర్ మహ్మద్ షమీ అవుట్ చేశాడు. అనంతరం మరో వికెట్ పడకుండా ఆసీస్ టీం జాగ్రత్త పడ్డ స్మిత్, ఖవాజా లంచ్ బ్రేక్ కు వెళ్లారు.
Gujarat: అక్రమాలను గుర్తించాడని ఐఏఎస్ అధికారిని చితకబాదిన కాంట్రాక్టర్..
ఈ ఏడాది భారత్, ఆస్ట్రేలియా మధ్య స్నేహ బంధానికి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. దీనికి గుర్తుగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా ఉన్న శ్రీ నరేంద్ర మోడీ స్టేడియంలో నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా ప్రధాని మోడీ, ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ హజరయ్యారు. టాస్ కు ముందు ఇరు దేశాల కెప్టెన్లకు క్యాప్ లను భారత్-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు అందజేశారు. అనంతరం ఇరు ప్రధానులు ల్యాప్ ఆఫ్ ఆనర్ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో వీరిద్దరూ గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం తమ ప్లేయర్లను ఇరు దేశా కెప్టెన్లు ప్రధానులకు పరిచయం చేశారు.
Lifestyle : జీవితంలో ఇవి మార్చుకుంటే.. మీ కాన్ఫిడెంట్స్ లెవల్ పెరిగినట్లే
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్ ప్రారంభమైంది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు గట్టిగా ఎదుర్కొంటున్నారు. ఈ టెస్ట్ గెలిచిన మ్యాచ్ డ్రా అయిన సీరిస్ భారత్ కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ ఆసీస్ గెలిస్తే మాత్రం 2-2 తేడాతో సీరిస్ ముగుస్తుంది.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!