Gujarat: అక్రమాలను గుర్తించాడని ఐఏఎస్ అధికారిని చితకబాదిన కాంట్రాక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat IAS officer held hostage, thrashed: గుజరాత్ లో ఏకంగా ఓ ఐఏఎస్ అధికారిని బందీగా చేసుకుని చితకబాదారు కొందరు వ్యక్తులు. ఫిషరీస్ ప్రాజెక్టు తనిఖీలో భాగంగా సదరు వ్యక్తుల తప్పులను ఎత్తిచూపిన సందర్భంలో కాంట్రాక్టర్, అతడి అనుచరులు ఐఏఎస్ అధికారితో పాటు అతని సిబ్బందిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన సబర్ కాంత జిల్లా పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
రాష్ట్రంలోని సబర్కాంత జిల్లాలోని ధరోయ్ డ్యామ్ సమీపంలోని ఒక గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన గుజరాత్ ఐఎఎస్ అధికారి నితిన్ సంగ్వాన్ ను బందీగా ఉంచినందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఫిషింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆయనను కొట్టారు. మత్స్యకార ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను గుర్తించినందుకే దాడి చేసినట్లు తెలుస్తోంది. ఫిషరీష్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాంగ్వాన్ సోమవారం సబర్మతీ నదిపై నిర్మించిన ధరోయ్ డ్యామ్ సమీపంలోని అంబవాడ గ్రామానికి ఒక మత్స్యకార ప్రాజెక్టును పరిశీలించడానికి ఫిషరీస్ డైరెక్టర్గా పనిచేస్తున్న సాంగ్వాన్ పాటు అతని సిబ్బంది వెళ్లారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
Read Also: Kidney Stones: కిడ్నీనా, రాళ్ల గనినా.. ఏకంగా 3 వేల రాళ్లు
ఆనకట్ట నీటిలో “కేజ్ కల్చర్ ఫిషింగ్” ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక కాంట్రాక్టర్లకు సబ్సిడీని అందిస్తుంది. తప్పులను గుర్తించడంతో బాబూ పర్మాన్ అనే కాంట్రాక్టర్ కోపంతో ఐఏఎస్ అధికారితో పాటు అతని సిబ్బందిని కొట్టాడు, ఇతడితో పాటు మరో నలుగురు వ్యక్తులు కూడా దాడికి పాల్పడ్డారు. మొత్తం 10 నుంచి 12 మంది వ్యక్తులు కలిసి వీరిని బందీలుగా చేసుకున్నారు. ఆ తరువాత వీరితో పోలీసులకు ఫిర్యాదు చేయమని కాగితంపై రాసి సంతకాలు తీసుకున్నారు, అధికారితో పాటు అతడి సిబ్బందిని డ్యాంలోకి విసిరేస్తామని బెదిరించారు.
అధికారి ఫిర్యాదు మేరకు పటేల్ వడాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. పలు సెక్షన్ల కింద బాబు పర్మాన్ అతడి అనుచరులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో దిలీప్ పర్మార్, నీలేష్ గామర్, విష్ణు గామర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టినట్లు సంబర్ కాంత జిల్లా ఎస్పీ విశాల్ వాఘేలా తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!