WTC Table: డబ్ల్యూటీసీలో దిగజారిన టీమిండియా.. పాకిస్థాన్ కంటే కిందకి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో గెలవాల్సిన టెస్టులో ఓటమి చెందిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. బర్మింగ్ హామ్లో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. అంతేకాకుండా రెండు పాయింట్లు కూడా కోసేశారు. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్లో ఇన్నాళ్లూ మూడో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. అటు పాకిస్థాన్ మూడో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 75 పాయింట్లు (52.08 పాయింట్ పర్సంటేజ్) ఉండగా పాకిస్థాన్ ఖాతాలో 44 పాయింట్లు (52.38 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి.
Read Also: IND vs ENG: బ్రాడ్.. నోర్మూసుకొని బ్యాటింగ్ చెయ్
Also Read
- Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
- PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా జట్టు కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో 84 పాయింట్లు (77.78 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు ఉంది. సౌతాఫ్రికా ఖాతాలో 60 పాయింట్లు (71.43 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి. ఇటీవల న్యూజిలాండ్ను 3-0తో ఓడించిన ఇంగ్లండ్ జట్టు తాజాగా టీమిండియాపై కూడా విజయకేతనం ఎగురవేసినా ఆ జట్టు ఏడో స్థానానికే పరిమితమైంది. ఇంగ్లండ్ ఖాతాలో 64 పాయింట్లు ఉండగా 33.33 పాయింట్ పర్సంటేజ్ మాత్రమే ఉంది. డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్లను ఇంగ్లండ్ జట్టే (16 మ్యాచ్లు) ఆడటం గమనార్హం.

తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!