WTC Table: డబ్ల్యూటీసీలో దిగజారిన టీమిండియా.. పాకిస్థాన్ కంటే కిందకి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్తో గెలవాల్సిన టెస్టులో ఓటమి చెందిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. తాజా ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. బర్మింగ్ హామ్లో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. అంతేకాకుండా రెండు పాయింట్లు కూడా కోసేశారు. దీంతో డబ్ల్యూటీసీ టేబుల్లో ఇన్నాళ్లూ మూడో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. అటు పాకిస్థాన్ మూడో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 75 పాయింట్లు (52.08 పాయింట్ పర్సంటేజ్) ఉండగా పాకిస్థాన్ ఖాతాలో 44 పాయింట్లు (52.38 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి.
Read Also: IND vs ENG: బ్రాడ్.. నోర్మూసుకొని బ్యాటింగ్ చెయ్
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టేబుల్లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా జట్టు కొనసాగుతోంది. ఆ జట్టు ఖాతాలో 84 పాయింట్లు (77.78 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు ఉంది. సౌతాఫ్రికా ఖాతాలో 60 పాయింట్లు (71.43 పాయింట్ పర్సంటేజ్) ఉన్నాయి. ఇటీవల న్యూజిలాండ్ను 3-0తో ఓడించిన ఇంగ్లండ్ జట్టు తాజాగా టీమిండియాపై కూడా విజయకేతనం ఎగురవేసినా ఆ జట్టు ఏడో స్థానానికే పరిమితమైంది. ఇంగ్లండ్ ఖాతాలో 64 పాయింట్లు ఉండగా 33.33 పాయింట్ పర్సంటేజ్ మాత్రమే ఉంది. డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్లను ఇంగ్లండ్ జట్టే (16 మ్యాచ్లు) ఆడటం గమనార్హం.

తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!