IND vs SA: తొలి మ్యాచ్ ఓటమితో జట్టులో మార్పులు..రెండో T20కి భారత తుది జట్టు ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా 13 మ్యాచులు గెలిచి, ప్రపంచ రికార్డు విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశ నెరవేరలేదు. తొలి T20 ముందు వరకు కూడా 12 విజయాలతో పొట్టి ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్, రొమేనియాలతో కలిసి సమానంగా ఉన్న భారత్ జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో కళ్లెం పడింది. దాంతో వరుస విజయాల రికార్డును తన పేరిట లిఖించుకోలేకపోయింది. ఇక రేపు జరిగే రెండో T20 కోసం భారత జట్టు సిద్ధం అవుతోంది. ఒడిశా వేదికగా కటక్ లోని బారాబతి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక రిషభ్ పంత్ కు కెప్టెన్ గా నిరూపించుకోవాలంటే.. ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అయితే పంత్ తొలి మ్యాచ్ లో కెప్టెన్ గా బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. దాంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి.
తొలి T20 మ్యాచ్ లో భారత బౌలింగ్ తేలిపోయింది. 212 లాంటి భారీ టార్గెట్ ను సైతం కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చహల్ తేలిపోయారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో భారత్ పూర్తిగా విఫలమైంది. ఆరంభంలో బాగా బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ లు చివర్లో దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక యుజువేంద్ర చహల్ ను ఉపయోగించుకోవడంలో పంత్ దారుణంగా లెక్క తప్పాడు. ఈ క్రమంలో అవేశ్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ ను తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే IPLలో అర్ష్ దీప్ సింగ్ డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించాడు. దాంతో ఉమ్రాన్ మాలిక్ మరోసారి బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.
Also Read
- Daniel Vettori: "పక్కా ప్లాన్తో దిగుతున్నాం".. పంజాబ్ జోరుకు బ్రేక్ వేసేందుకు SRH కోచ్ మాస్టార్ ప్లాన్!
- Axar Patel: కెప్టెన్ అక్షర్ పటెల్ బిగ్ మిస్టెక్స్.. ఏకంగా 2 పాయింట్స్ కోల్పోయిన ఢిల్లీ!
- IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
- Sanju Samson: 'చెట్టా' కాదు.. 'సంజూ' అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఎక్స్ ట్రా బౌలర్ తో ఆడాలనుకుంటే మాత్రం దినేశ్ కార్తీక్ ను బెంచ్ కే పరిమితం చేసే అవకాశం ఉంది. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్, పంత్ మిడిల్ ఓవర్లలో అద్బుతంగా ఆడారు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా మునుపటిలా రెచ్చిపోయాడు. దాంతో భారత బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తోంది. ఎటొచ్చి బౌలింగ్, ఫీల్డింగ్ లలోనే టీమిండయా కాస్తా మెరుగవ్వాల్సిన పరిస్థితి. సౌతాఫ్రికా కూడా సూపర్ ఫామ్ లో ఉంది. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, డుస్సెన్ రూపంలో మ్యాచ్ విన్నర్లు ఆ జట్టు సొంతం. ఇక గత మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన ప్రిటోరియస్ తాను మెరుపులు మెరిపించగలనని స్పష్టం చేశాడు. దాంతో కటక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు పండగే అని చెప్పాలి.
కటక్ వేదికగా ఇప్పటి వరకు భారత్ రెండు T20 మ్యాచ్ లు ఆడింది. మొదటి మ్యాచ్ లో శ్రీలంకపై నెగ్గిన టీమిండియా.. తరువాత సౌతాఫ్రికా చేతిలో దారుణంగా ఓడింది.
టీమిండియా తుది జట్టు (అంచనా):
రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్/అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్
తాజావార్తలు
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!