IND vs SA: తొలి మ్యాచ్ ఓటమితో జట్టులో మార్పులు..రెండో T20కి భారత తుది జట్టు ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుసగా 13 మ్యాచులు గెలిచి, ప్రపంచ రికార్డు విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశ నెరవేరలేదు. తొలి T20 ముందు వరకు కూడా 12 విజయాలతో పొట్టి ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్, రొమేనియాలతో కలిసి సమానంగా ఉన్న భారత్ జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో కళ్లెం పడింది. దాంతో వరుస విజయాల రికార్డును తన పేరిట లిఖించుకోలేకపోయింది. ఇక రేపు జరిగే రెండో T20 కోసం భారత జట్టు సిద్ధం అవుతోంది. ఒడిశా వేదికగా కటక్ లోని బారాబతి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక రిషభ్ పంత్ కు కెప్టెన్ గా నిరూపించుకోవాలంటే.. ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అయితే పంత్ తొలి మ్యాచ్ లో కెప్టెన్ గా బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. దాంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి.
తొలి T20 మ్యాచ్ లో భారత బౌలింగ్ తేలిపోయింది. 212 లాంటి భారీ టార్గెట్ ను సైతం కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చహల్ తేలిపోయారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో భారత్ పూర్తిగా విఫలమైంది. ఆరంభంలో బాగా బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ లు చివర్లో దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక యుజువేంద్ర చహల్ ను ఉపయోగించుకోవడంలో పంత్ దారుణంగా లెక్క తప్పాడు. ఈ క్రమంలో అవేశ్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ ను తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే IPLలో అర్ష్ దీప్ సింగ్ డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించాడు. దాంతో ఉమ్రాన్ మాలిక్ మరోసారి బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.
Also Read
- US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్గా మరో రికార్డు..
- World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ఎక్స్ ట్రా బౌలర్ తో ఆడాలనుకుంటే మాత్రం దినేశ్ కార్తీక్ ను బెంచ్ కే పరిమితం చేసే అవకాశం ఉంది. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్, పంత్ మిడిల్ ఓవర్లలో అద్బుతంగా ఆడారు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా మునుపటిలా రెచ్చిపోయాడు. దాంతో భారత బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తోంది. ఎటొచ్చి బౌలింగ్, ఫీల్డింగ్ లలోనే టీమిండయా కాస్తా మెరుగవ్వాల్సిన పరిస్థితి. సౌతాఫ్రికా కూడా సూపర్ ఫామ్ లో ఉంది. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, డుస్సెన్ రూపంలో మ్యాచ్ విన్నర్లు ఆ జట్టు సొంతం. ఇక గత మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన ప్రిటోరియస్ తాను మెరుపులు మెరిపించగలనని స్పష్టం చేశాడు. దాంతో కటక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు పండగే అని చెప్పాలి.
కటక్ వేదికగా ఇప్పటి వరకు భారత్ రెండు T20 మ్యాచ్ లు ఆడింది. మొదటి మ్యాచ్ లో శ్రీలంకపై నెగ్గిన టీమిండియా.. తరువాత సౌతాఫ్రికా చేతిలో దారుణంగా ఓడింది.
టీమిండియా తుది జట్టు (అంచనా):
రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్/అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్
తాజావార్తలు
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!