IND vs PAK: 7 ఏళ్ల తర్వాత భారత్కు పాకిస్తాన్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan will come to India after 7 Years for World Cup 2023: భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. అహ్మదాబాద్లో అక్టోబరు 5న మెగా సమరం ఆరంభం అయి.. నవంబరు 19న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు, 2 నాకౌట్ మ్యాచ్లు (సెమీ ఫైనల్స్), ఒక ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్లకు భారత్లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచకప్ మ్యాచ్ల కోసం భారత్ సహా అన్ని దేశాల ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో టీమిండియా తన ప్రపంచకప్ 2023 పోరాటాన్ని ప్రారంభిస్తుంది. అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరగనుంది. దాయాది జట్లు ప్రపంచంలోనే అత్యధిక కెపాసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ప్రపంచకప్ 2023 కోసం పాకిస్తాన్ జట్టు ఏడేళ్ల విరామం తర్వాత భారత్లో అడుగుపెట్టనుంది.
Also Read
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
- Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
- India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
పాకిస్థాన్ చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2016 కోసం భారత్ గడ్డపైకి వచ్చింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో భారత్తో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత పాకిస్థాన్ ఇప్పటివరకు కూడా భారత్కు రాలేదు. ప్రపంచకప్ 2023 పుణ్యమాని ఏడేళ్ల తర్వాత భారత గడ్డపైకి అడుగుపెట్టనుంది. ఇరు దేశాల మధ్య బేధాభిప్రాయాల కారణంగా గత కొంత కాలంగా భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి.
2016 టీ20 ప్రపంచకప్లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (26), అహ్మద్ షెహజాద్ (25) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో సురేష్ రైనా, రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా తలో వికెట్ పడగొట్టారు. 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో పూర్తిచేసింది. విరాట్ కోహ్లీ (55 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. మొహ్మద్ సమీ 2 వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Big Pay Hike: టీచర్లకు గుడ్న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
తాజావార్తలు
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!