PSL vs IPL: ఐపీఎల్ను విమర్శించినందుకు వసీం అక్రమ్కు పాకిస్థాన్ బహుమతి
- ఐపీఎల్పై పరోక్ష విమర్శలు చేసిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీమ్ ఆక్రమ్..
- పీఎస్ఎల్ 34 రోజులు జరిగితే, ఇతర లీగ్స్ పిల్లలు పెద్దవాళ్లైన ముగియదన్నారు..
- వసీమ్ అక్రమ్కు పీఎస్ఎల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన పాక్ క్రికెట్ బోర్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL vs IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను విమర్శించిన పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీమ్ అక్రమ్కు ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్ద బాధ్యతలు అప్పగించింది. రాబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సీజన్కు వసీమ్ అక్రమ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఇది పీఎస్ఎల్ చరిత్రలో అక్రమ్కు ఇదే తొలిసారి. ఇటీవల లండన్లో జరిగిన పీఎస్ఎల్ ఈవెంట్లో మాట్లాడిన వసీమ్ అక్రమ్.. ఐపీఎల్పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. “పీఎస్ఎల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం 34 రోజులు మాత్రమే జరుగుతుంది. మూడు నెలలు సాగే ఇతర లీగ్ల వలే కాదు.. పిల్లలు పెద్దవాళ్లు అవుతారు కానీ, ఆ లీగ్ మాత్రం ముగియదు అంటూ ఐపీఎల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, వసీమ్ అక్రమ్ 2009 నుంచి 2016 వరకు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు బౌలింగ్ కోచ్గా పని చేశారు. ఆయన కోచింగ్లోనే కేకేఆర్ 2012, 2014 సంవత్సరాల్లో రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుంది. అయితే, 2017 ఐపీఎల్కు ముందు అక్రమ్ కేకేఆర్ను వీడగా, అప్పటి నుంచి ఐపీఎల్కు దూరంగానే ఉన్నారు.
Read Also: Nidhhi Agerwal : పవన్–ప్రభాస్ మల్టీస్టారర్పై కన్నేసిన నిధి అగర్వాల్..
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
అయితే, ఈసారి పీఎస్ఎల్, ఐపీఎల్తో పోటీ పడబోతుంది. పీఎస్ఎల్ 2026 మార్చి 23 నుంచి మే తొలి వారం వరకు కొనసాగనుంది. అదే సమయంలో మార్చి 26 నుంచి మే 31వ తేదీ వరకు ఐపీఎల్ నిర్వహించనున్నట్లు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్గా గుర్తింపు పొందిన ఐపీఎల్కు ఇది మరో భారీ సీజన్ కానుంది. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన జరిగింది.
ఇక, 2008లో ప్రారంభమైన తొలి ఐపీఎల్ సీజన్లో పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల వారు మళ్లీ ఐపీఎల్లో ఆడలేదు.. అయితే, మాజీ పాకిస్థాన్ ఆల్రౌండర్ అజర్ మహ్మద్ బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత ఐపీఎల్లో పాల్గొ్న్నాడు. ఇక, పీఎస్ఎల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క భారత ఆటగాడు కూడా ఆ లీగ్లో పాల్గొనలేదు. భారత క్రికెటర్లకు విదేశీ లీగ్ల్లో ఆడేందుకు అనుమతి లేదు. అయితే, రిటైర్డ్ క్రికెటర్లు మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్లలో పాల్గొనవచ్చు. ఐపీఎల్ పై చేసిన విమర్శలతో వసీం అక్రమ్ నను పీఎస్ఎల్ బ్రాండ్ అంబాసిడర్గా నియామకం మరింత చర్చకు దారి తీసింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..