Gautam Gambhir: నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయను..
- సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్..
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్ గురించి గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు..
- టీమిండియా జట్టు ప్రదర్శన మరింత మెరుగుపడాల్సి ఉంది: హెడ్ కోచ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్పై కీలక కామెంట్స్ చేశాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్ గురించి తనకు ఆందోళన అవసరం లేదు.. వారు పరుగులు చేయడానికి ఇంకా ఆకలితో ఉన్నారని తెలిపాడు. నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం లేదు.. అది వారి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందన్నారు. వారిలో తపన, నిబద్ధత ఉంటే.. వారు భారత క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తారని గంభీర్ పేర్కొన్నాడు.
Read Also: Nara Lokesh: నా ఉద్యోగం తీయించేలా ఉన్నావే.. విద్యార్థితో లోకేశ్ ఛలోక్తి!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
నేను ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటాను.. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు ఆడిన ప్లేయరైనా ఒకేలా ఉంటాను అని కోచ్ గంభీర్ తెలిపారు. కేవలం జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం వల్లే సానుకూల ఫలితం రాలేదని నేను చెప్పను.. కానీ, గెలిచే అవకాశం ఉండే.. అయినా మాకు ఐదుగురు బౌలర్లతో కూడిన మంచి జట్టు ఉంది. ఏ ఒక్కరిపై తాము ఆధారపడం.. మేము ఇక్కడ కేవలం సిరీస్ ఓడిపోయాం అని టీమిండియా హెచ్ కోచ్ చెప్పాడు. మెల్బొర్న్ చివరి సెషన్లో సమష్టిగా పోరాడితే.. ఆసీస్పై ఒత్తిడి పెరుగుతుండే..ఈ మ్యాచ్లో కూడా గెలిచే అవకాశలు వచ్చాయి.. తొలి ఇన్నింగ్స్లో 181 కొట్టినా ఆధిక్యం దక్కింది.. కానీ, రెండో ఇన్నింగ్స్లో 250 లేదా 300 టార్గెట్ ఇస్తే పక్కా విజయం సాధించే వాళ్లం.. బ్యాటింగ్, బౌలింగ్ లోపమని నేను తప్పుపట్టను.. మొత్తంగా మా జట్టు ఇంకా మెరుగుపడాల్సి ఉంది అని గౌతమ్ గంభీర్ వెల్లడించారు.
Read Also: Vishwambhara : యంగ్ హీరోకి పోటీగా రానున్న మెగాస్టార్ !
అయితే, మా జట్టులో చాలా మంది మా కుర్రాళ్లకు ఇది తొలి సిరీస్.. చాలా కఠిన పరీక్షను వారు ఎదుర్కొన్నారని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. మహ్మద్ సిరాజ్ అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు.. బుమ్రా అద్భుతంగా ఆడాడు.. జైస్వాల్ పరుగులు కొట్టాడని చెప్పుకొచ్చాడు. ఇక, జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడటం పద్దతి కాదు.. మరో టెస్టు సిరీస్కు ఐదు నెలల సమయం ఉందని అతడు పేర్కొన్నాడు. కాగా, సిడ్నీ టెస్టులో ఓటమితో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో కోల్పోయింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 27 ఓవర్లలోనే నాలుగు వికెట్లను కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా స్కాట్ బోలాండ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా జస్ప్రీత్ బుమ్రా అవార్డులను దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!