Gautam Gambhir: నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయను..
- సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్..
- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్ గురించి గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు..
- టీమిండియా జట్టు ప్రదర్శన మరింత మెరుగుపడాల్సి ఉంది: హెడ్ కోచ్ గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: సిడ్నీ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేరుగా మీడియా సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన కోహ్లీ, రోహిత్పై కీలక కామెంట్స్ చేశాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్ గురించి తనకు ఆందోళన అవసరం లేదు.. వారు పరుగులు చేయడానికి ఇంకా ఆకలితో ఉన్నారని తెలిపాడు. నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేయడం లేదు.. అది వారి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందన్నారు. వారిలో తపన, నిబద్ధత ఉంటే.. వారు భారత క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తారని గంభీర్ పేర్కొన్నాడు.
Read Also: Nara Lokesh: నా ఉద్యోగం తీయించేలా ఉన్నావే.. విద్యార్థితో లోకేశ్ ఛలోక్తి!
Also Read
- Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
- Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
నేను ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉంటాను.. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు ఆడిన ప్లేయరైనా ఒకేలా ఉంటాను అని కోచ్ గంభీర్ తెలిపారు. కేవలం జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం వల్లే సానుకూల ఫలితం రాలేదని నేను చెప్పను.. కానీ, గెలిచే అవకాశం ఉండే.. అయినా మాకు ఐదుగురు బౌలర్లతో కూడిన మంచి జట్టు ఉంది. ఏ ఒక్కరిపై తాము ఆధారపడం.. మేము ఇక్కడ కేవలం సిరీస్ ఓడిపోయాం అని టీమిండియా హెచ్ కోచ్ చెప్పాడు. మెల్బొర్న్ చివరి సెషన్లో సమష్టిగా పోరాడితే.. ఆసీస్పై ఒత్తిడి పెరుగుతుండే..ఈ మ్యాచ్లో కూడా గెలిచే అవకాశలు వచ్చాయి.. తొలి ఇన్నింగ్స్లో 181 కొట్టినా ఆధిక్యం దక్కింది.. కానీ, రెండో ఇన్నింగ్స్లో 250 లేదా 300 టార్గెట్ ఇస్తే పక్కా విజయం సాధించే వాళ్లం.. బ్యాటింగ్, బౌలింగ్ లోపమని నేను తప్పుపట్టను.. మొత్తంగా మా జట్టు ఇంకా మెరుగుపడాల్సి ఉంది అని గౌతమ్ గంభీర్ వెల్లడించారు.
Read Also: Vishwambhara : యంగ్ హీరోకి పోటీగా రానున్న మెగాస్టార్ !
అయితే, మా జట్టులో చాలా మంది మా కుర్రాళ్లకు ఇది తొలి సిరీస్.. చాలా కఠిన పరీక్షను వారు ఎదుర్కొన్నారని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. మహ్మద్ సిరాజ్ అద్భుతమైన పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు.. బుమ్రా అద్భుతంగా ఆడాడు.. జైస్వాల్ పరుగులు కొట్టాడని చెప్పుకొచ్చాడు. ఇక, జట్టు భవిష్యత్తు గురించి మాట్లాడటం పద్దతి కాదు.. మరో టెస్టు సిరీస్కు ఐదు నెలల సమయం ఉందని అతడు పేర్కొన్నాడు. కాగా, సిడ్నీ టెస్టులో ఓటమితో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో కోల్పోయింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 27 ఓవర్లలోనే నాలుగు వికెట్లను కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా స్కాట్ బోలాండ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా జస్ప్రీత్ బుమ్రా అవార్డులను దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?