BCCI: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ బిగ్ షాక్.. వారితో స్టేయింగ్ టైం కుదింపు..?
- టీమిండియా క్రికెటర్లపై ఆంక్షలు విధించబోతున్న బీసీసీఐ..
- భార్య సహా కుటుంబ సభ్యులకు స్టేయింగ్ టైమ్ కుదించిన బోర్డు..
- భారత జట్టు హెడ్ కోచ్ గంభీర్కు ఇచ్చిన స్వేచ్ఛకూ బీసీసీఐ కత్తెర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు్కు ఘోర పరాభవం ఎదురైంది. ఐదు టెస్టుల సిరీస్ను 1-3 తేడాతో కోల్పోవడంతో పాటు అంతకు ముందు న్యూజిలాండ్తో సిరీస్ను వైట్వాష్కు గురైంది. ఈ క్రమంలో శనివారం బీసీసీఐ సమీక్ష సమావేశం చేపట్టింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐ గతంలో ఎవరికీ ఇవ్వని అధికారాలు, స్వేచ్ఛను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇచ్చింది. టీమ్ ఎంపికతో పాటు సహాయక కోచ్లను తనకు ఇష్టమైన వారిని తీసుకొనే ఛాన్స్ ఇవ్వగా.. కానీ, ఫలితాలు మాత్రం జీరో వచ్చాయి. దీంతో పాటు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఇక, కఠిన చర్యలు తీసుకునేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది.
Read Also: Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ఇక, 2019 నుంచి విదేశీ టూర్లకు భారత సీనియర్ క్రికెటర్లు వెళ్లే టైంలో.. వారితో పాటు కుటుంబ సభ్యులకూ బీసీసీఐ పర్మిషన్ ఇచ్చేది. కానీ, ఇప్పుడు ఇదే ప్లేయర్స్ ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బీసీసీఐ అనుకుంటుంది. అయితే, ఇప్పటి నుంచి ఏ విదేశీ పర్యటనకైనా భార్య సహా కుటుంబ సభ్యులకు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఐదేళ్ల ముందు వరకు ఉన్న రూల్స్ మళ్లీ తీసుకురావాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. 45 రోజుల విదేశీ టూర్ కు టీమ్ వెళ్లినప్పుడు.. ప్లేయర్స్ కుటుంబ సభ్యులతో ఉండేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Law student suicide: లా స్టూడెంట్ ఆత్మహత్య.. మాజీ ప్రియురాలి అరెస్ట్..
అయితే, టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఇచ్చిన స్వేచ్ఛకూ బీసీసీఐ కత్తెర వేసేందుకు రెడీ అయింది. గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరాకు ఇప్పటి వరకు మ్యాచ్లకు హాజరైనప్పుడు టీమ్ ఉండే హోటల్లో వసతి కల్పించేవారు. కానీ, ఇక నుంచి అలాంటి వెసులు బాటు ఉండదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, స్టేడియంలోని వీఐపీ బాక్స్లో కూర్చొనే ఛాన్స్ కూడా తీసేయబోతుంది. సహాయక సిబ్బంది పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించబోతుంది.. ప్రదర్శన ఆధారంగానే వారికి మళ్లీ ఛాన్స్ ఇవ్వనుంది. దీంతో పాటు తాము తీసుకెళ్లే 150 కేజీల లగేజీకి మించి ఉంటే ప్లేయర్లే దానికి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!