CSK vs DC: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. ఢీల్లీ లక్ష్యం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Need 168 Runs To Win Against CSK: చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. శివమ్ దూబే ఒక్కడే 25 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్గా నిలిచాడు. రుతురాజ్ (24), రహానే (21), రాయుడు (23), జడేజా (21), ధోని (20).. ఇలా అందరూ తక్కువ స్కోర్లతో రాణించారంతే! ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. చెన్నై బ్యాటర్లు తడబడ్డారు. నిజానికి.. ఇది చెన్నై హోమ్గ్రౌండ్ కావడంతో ఆ జట్టు పరుగుల సునామీ సృష్టించి, 200 కు పైగా భారీ స్కోరు చేస్తుందని మొదట్లో అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా ఢిల్లీ బౌలర్లు 167 పరుగులకే కట్టడి చేశారు.
Anasuya: ‘THE’ వివాదంలోకి ఎంటర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్..
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!

తమ జట్టుకి ఎప్పుడూ శుభారంభం అందించే రుతురాజ్, కాన్వే (10).. ఈసారి ఆశాజనకంగా రాణించలేదు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. రహానే కొద్దిసేపు క్రీజులో ఉన్నా.. బీస్ట్ మోడ్ మాత్రం ఆన్ చేయలేదు. 21 పరుగులతోనే సర్దుబాటు చేసుకున్నాడు. మోయిన్ అలీ సైతం ఈసారి చేతులెత్తేశాడు. 7 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే ఒక్కడే కొంచెం మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 3 సిక్స్లతో 25 పరుగులు చేశాడు. ఆ ఊపులోనే ఓ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. అంబటి రాయుడు 23 వ్యక్తిగత స్కోర్తో పర్వాలేదనిపించాడంతే! చివర్లో జడేజా, ధోనీ మెరుపులు మెరిపించడంతో.. సీఎస్కే స్కోరు పరుగులు పెట్టింది. ధోనీ 9 బంతుల్లోనే రెండు సిక్స్లు, ఒక ఫోర్ కొట్టి 20 పరుగులు చేశాడు. బౌండరీల మోత మోగించాలన్న ఉద్దేశంతో.. స్ట్రెయిట్గా షాట్ కొడితే, అది నేరుగా వార్నర్ చేతికి చిక్కింది.
Bandi Sanjay : భాగ్యనగర్ ప్రజల ప్రాణాలు ఉగ్రవాదుల చేతిలో ఉన్నాయి
ఇక ఢిల్లీ బౌలర్ల విషయానికొస్తే.. మిచెల్ మార్ష్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. 3 ఓవర్లు వేసిన అతగాడు కేవలం 18 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా పొదుపుగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో 27 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఖలీల్, లలిత్, కుల్దీప్ తలా వికెట్ పడగొట్టారు. ఇషాంత్ శర్మ ఒక్కడే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లే వేసిన అతడు 23 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఢిల్లీ జట్టుకి 168 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి.. ఢిల్లీ ఆ లక్ష్యాన్ని ఛేధిస్తుందా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!