NZvsSL: కివీస్ ను ఆదుకుని.. భారత్ కు ఆశలు కల్పించిన మిచెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైస్ట్ చర్చ్ వేదికగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో తొలుత తడబడ్డా కివీస్ తర్వాత పుంజుకుంది. డారిల్ మిచెల్ అద్బుత సెంచరీకి తోడు లోయరార్డర్ లో హెన్రీ రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్ లో లంక కంటే ఎక్కువ స్కోరు న్యూజిలాండ్ జట్టు చేసింది. డారెల్ మిచెల్(102) చేయగా హెన్రీ ( 75 బంతుల్లో 72, 10 ఫోర్లు, 3సిక్సర్లు) వన్డే తరహా ఆట ఆడారు. ఫలితంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 373 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 162-5 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన కివీస్ జట్టును మిచెల్ ఆదుకున్నాడు. మైఖేల్ బ్రాస్ వెల్ (25) నిరాశపరిచాడు. కెప్టెన్ టీమ్ సౌథీ (25) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు.
Aslo Read : Obesity : కొవ్వు తగ్గాలంటే కొన్నింటికి దూరంగా ఉండాల్సిందే.. వాటిలో మెయిన్ ఇవే
Also Read
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
ఒకవైపు వికెట్లు పడుతున్నా మిచెల్ పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. హన్రీ వచ్చిన తర్వాత మిచెల్ కూడా స్వేచ్చగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరూ 9వ వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డారెల్ మిచెల్ ఔటైయ్యే సమయానాకి న్యూజిలాండ్ 291-8గానే ఉంది కానీ హెన్రీ మెరుపులతో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో లంక స్కోరు (3550ను దాటేసింది. చివర్లో వాగ్నర్ (24బంతుల్లో 27, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 373 పరుగులు చేయగలిగింది. ఫలితంగా మొదటి ఇన్సింగ్స్ లో 18 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని న్యూజిలాంట్ టీమ్ సాధించింది.
Aslo Read : Japanese Tourist: హోలీ వేడుకల్లో వేధింపులు.. దేశం వీడిన బాధితురాలు
కాగా, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక.. ఇప్పటికే మూడు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(28), దిముత్ కరుణరత్నే(17)లు విఫలమయ్యారు. వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(14) కూడా నిరాశపరిచాడు. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్( 20 నాటౌట్), ప్రభాత్ జయసూర్య(2నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 38ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసి 65 పరుగుల లీడ్ సాధించింది.
Aslo Read : India’s services sector: ఫిబ్రవరిలో 12 ఏళ్ల గరిష్టానికి పీఎంఐ
కాగా, భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ చేరాలంటే లంక-కివీస్ లటెస్ట్ మ్యాచ్ ఫలితం కూడా కీలకంగా మారింది. ఒకవేళ అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఓడితే.. లంకకు డబ్య్లూటీసీ ఫైనల్ చేరేందుకు అవకాశాలుంటాయి. కివీస్ ను రెండు మ్యాచ్ లలో ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీస్ చేస్తే లంకేయులు ఫైనల్ కు చేరుతారు. ప్రస్తుతం ఈ టెస్టులో శ్రీలంక గెలవడం కొంచెం కష్టమే.. ఈ నేపథ్యంలో మిచెల్ కివీస్ తో పాటు భారత జట్టను ఆదుకున్నటే.. ప్రస్తుత అహ్మదాబాద్ టెస్టులో భారత్ గెలుపు సంగతి దేవుడెరుగు కానీ మ్యాచ్ ను కనీసం డ్రా చేసుకున్నా అదే పదివేలు అని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!