Rohit-Kohli: వన్డేల్లో కొనసాగాలంటే.. రో-కోకు బీసీసీఐ వార్నింగ్!
- టీ20, టెస్ట్ క్రికెట్కు రో-కో రిటైర్మెంట్
- వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్న రో-కోలు
- రో-కోకు బీసీసీఐ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రో-కోలు ప్రస్తుతం వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు ఆడారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిట్నెస్ వారికి ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో కొనసాగాలంటే.. దేశవాళీల్లో పాల్గొనాల్సిందే అని రో-కోకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కానుంది.
‘సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీమిండియా తరఫున ఆడాలనుకుంటే.. ఇద్దరు తప్పకుండా దేశవాళీల్లో ఆడాల్సిందే అని స్పష్టం చేసింది. వారిద్దరూ రో-కోలు టీ20, టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. వన్డేల్లో ఆడాలంటే మ్యాచ్ ఫిట్నెస్ కోసం ఇద్దరు దేశవాళీల్లో ఆడాలి’ అని బీసీసీఐ అధికారి చెప్పారు. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్కు (ఎంసీఏ) రోహిత్ తెలిపాడు. నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో కూడా ఆడతానని ఎంసీఏకు చెప్పాడు. మరోవైపు కోహ్లీ నుంచి ఇంకా ఎలాంటి సందేశం బీసీసీఐకి అందలేదట. చివరగా 2010లో ఢిల్లీ తరఫున ఆడాడు.
Also Read
- Rishab Pant: పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో LSG.. తప్పులేదంటూ రిషభ్ పంత్కు సునీల్ గవాస్కర్ మద్దతు..
- MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
- Jessica Head: అబ్బె.. ఏం చిల్లరగాళ్లు ఉన్నారా మీరు.! కోహ్లితో వాగ్వాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు ఆన్లైన్ వేధింపుల సెగ..
- Rajasthan Royals Injuries: ప్లేఆఫ్స్ చేరినా రాజస్థాన్కు టెన్షన్.. గాయాలతో సతమవుతున్న స్టార్ ప్లేయర్స్.!
Also Read: Kalvakuntla Kavitha: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 3 నుండి 9 వరకు భారత్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడుతుంది. ఈ సిరీస్ కోసం స్వ్కాడ్ను ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో స్వదేశంలోనే వన్డే సిరీస్ను ఆడనుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్లో ఆడాలని ఇద్దరు దిగ్గజాలు చూస్తున్నారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో రోహిత్ హాఫ్సెంచరీ, సెంచరీతో మెరిశాడు. రెండు డకౌట్ల తర్వాత కోహ్లీ అజేయంగా 87 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Stock Market: లాభాల పంట పండించిన స్టాక్ మార్కెట్.. రేపటి వ్యూహం ఇలా..
-
Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
-
Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
-
NBK112 Movie Launch Date: టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ కాంబో.. ‘NBK112’ ముహూర్తానికి డేట్ ఫిక్స్!
-
Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!