Rohit-Kohli: వన్డేల్లో కొనసాగాలంటే.. రో-కోకు బీసీసీఐ వార్నింగ్!
- టీ20, టెస్ట్ క్రికెట్కు రో-కో రిటైర్మెంట్
- వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్న రో-కోలు
- రో-కోకు బీసీసీఐ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20, టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రో-కోలు ప్రస్తుతం వన్డేల్లోనే మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇద్దరు ఆడారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫిట్నెస్ వారికి ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వన్డేల్లో కొనసాగాలంటే.. దేశవాళీల్లో పాల్గొనాల్సిందే అని రో-కోకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కానుంది.
‘సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టీమిండియా తరఫున ఆడాలనుకుంటే.. ఇద్దరు తప్పకుండా దేశవాళీల్లో ఆడాల్సిందే అని స్పష్టం చేసింది. వారిద్దరూ రో-కోలు టీ20, టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. వన్డేల్లో ఆడాలంటే మ్యాచ్ ఫిట్నెస్ కోసం ఇద్దరు దేశవాళీల్లో ఆడాలి’ అని బీసీసీఐ అధికారి చెప్పారు. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ముంబై క్రికెట్ అసోసియేషన్కు (ఎంసీఏ) రోహిత్ తెలిపాడు. నవంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో కూడా ఆడతానని ఎంసీఏకు చెప్పాడు. మరోవైపు కోహ్లీ నుంచి ఇంకా ఎలాంటి సందేశం బీసీసీఐకి అందలేదట. చివరగా 2010లో ఢిల్లీ తరఫున ఆడాడు.
Also Read
- IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
- VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
- IND Vs ZIM: తిలక్ వర్మ వీరవిహారం.. టీమిండియా భారీ స్కోర్..
- Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
Also Read: Kalvakuntla Kavitha: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 3 నుండి 9 వరకు భారత్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడుతుంది. ఈ సిరీస్ కోసం స్వ్కాడ్ను ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో స్వదేశంలోనే వన్డే సిరీస్ను ఆడనుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్లో ఆడాలని ఇద్దరు దిగ్గజాలు చూస్తున్నారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో రోహిత్ హాఫ్సెంచరీ, సెంచరీతో మెరిశాడు. రెండు డకౌట్ల తర్వాత కోహ్లీ అజేయంగా 87 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
-
Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
-
KTR : పదవుల్లో ఉన్న వారికంటే ప్రజల బలమే గొప్పది.. జెన్-జీకి కేటీఆర్ సెల్యూట్
-
IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
-
Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!