BCCI vs BCB: భారత్కు బంగ్లాదేశ్ జట్టును పంపం.. మేం ఐసీసీతోనే తేల్చుకుంటాం!
- ఐపీఎల్ 2026 నుంచి ముస్తాఫిజుర్ రహమాన్ అవుట్
- కీలక నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
- భారత్కు బంగ్లాదేశ్ జట్టును పంపం అంటున్న బిసీబీ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026కు తమ జట్టును పంపడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి జట్టును పంపడం తమకు సురక్షితంగా అనిపించడం లేదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే విషయాన్ని బీసీబీ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ ద్వారా తెలియజేసినట్టు వెల్లడించారు. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ చేయడమే ఈ పరిణామాలకు కారణం. ఈ నేపథ్యంలోనే బీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది.
‘ఈ నిర్ణయం తీసుకునే ముందు బిసీబీ బోర్డు డైరెక్టర్లతో కలిసి రెండుసార్లు సమావేశం అయ్యాం. ప్రస్తుత పరిస్థితుల్లో 2026 టీ20 వరల్డ్కప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టును భారత్కు పంపడం సురక్షితం కాదని భావించాం. అందుకే ఐసీసీకి లేఖ రాశాం. భద్రతే మాకు ప్రధాన సమస్య. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే ఐసీసీతో మీటింగ్ ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ సమావేశంలో మా సమస్యలను పూర్తిగా వివరిస్తాం. ఇది ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీ. కాబట్టి మేము బీసీసీఐతో కాకుండా ఐసీసీతోనే సంప్రదింపులు జరుపుతున్నాం’ అని బిసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం తెలిపారు.
Also Read
- Vaibhav Suryavanshi: వైభవ్కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
- Hardik Pandya: కీలక నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్య.. MI కి బై బై.. ఆగస్టులో ఆ జట్టులోకి ఎంట్రీ..?
- Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు.. వినేష్ ఫోగాట్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
- RR Vs GT Qualifier 2: టాస్ గెలవొద్దని కోరుకుంటున్న ఆర్ఆర్(RR), జీటీ(GT) టీమ్స్.. కారణం ఏంటో తెలుసా..?
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు 2026 టీ20 వరల్డ్కప్లోభాగంగా భారత్లో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో మూడు మ్యాచ్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో, ఒక మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. గ్రూప్ ‘సి’లో ఉన్న బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్ జట్లతో పోటీ పడాల్సి ఉంది. ఐసీసీ ఒప్పుకుంటే బంగ్లాదేశ్ తమ మ్యాచ్లను భారత్లో కాకుండా శ్రీలంకలో ఆడే అవకాశాలు ఉన్నాయి. దాయాది పాకిస్థాన్ మ్యాచ్లు లంకలో జరుగుతున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఐసీసీ ఏ నిర్ణయం తీసిఉంటుందో.
Also Read: Mohammed Shami: చిక్కుల్లో మొహమ్మద్ షమీ.. విచారణకు హజరుకావాలంటూ నోటీసులు!
ఇటీవల భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఆమె గత ఆగస్టులో భారత్కు రావడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు విద్యార్థులు మృతి చెందారు. హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక దాడులు పెరిగాయి. ఈ రాజకీయ, సామాజిక పరిణామాల నేపథ్యంలోనే టీ20 వరల్డ్కప్లో పాల్గొనేందుకు భారత్కు రావడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా ఆందోళనలు వ్యక్తం చేయడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: వైభవ్కు మా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ దొరికితే ఖతమే.. బుడ్డోడి ఆటకు పాక్ ఫిదా..
-
Vivo T5: వివో T5 మిడ్-రేంజ్ ఫోన్ విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6s Gen 2 చిప్
-
CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
-
Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
-
Trump-Pakistan: ట్రంప్తో పాకిస్థాన్కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!